Tejasvi Surya: డీలిమిటేషన్పై కావాలనే అలజడి సృష్టిస్తున్నారు.. విపక్షంపై తేజస్వీ సూర్య ఆరోపణలు
- డీలిమిటేషన్పై కావాలనే అలజడి సృష్టిస్తున్నారు
- దక్షిణాదికి మేలే తప్ప.. అన్యాయం జరగదు
- విపక్షంపై తేజస్వీ సూర్య ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీలిమిటేషన్ బిల్లుపై దక్షిణ భారతదేశ ప్రజల్లో గందరగోళం వ్యాపింపజేస్తున్నారని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా తేజస్వీ సూర్య మాట్లాడారు. డీలిమిటేషన్ బిల్లుపై అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఉన్నాయని తెలిపారు.
‘‘రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ తప్పనిసరి. డీలిమిటేషన్ను సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్నది అవాస్తవం. కేరళలో 10 సీట్లు పెరుగుతున్నాయి. ఇది కేరళకు లాభమే కదా?, అలాగే ఏపీ, తెలంగాణలో కూడీ సీట్లు పెరగబోతున్నాయి. జీఎస్డీపీ ఆధారంగా సీట్లు పెంచాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇది ఫూలిష్ ప్రతిపాదన. రేవంత్రెడ్డికి సలహా ఎవరిచ్చారో తెలియదు. 1996లో మొదలైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు కొలిక్కి వచ్చింది. డీలిమిటేషన్పై తమిళనాడు కావాలనే రాద్ధాంతం చేస్తోంది. 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం.’’ అని తేజస్వీ సూర్య చెప్పుకొచ్చారు.
Also Read
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. 131 రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టాలా? వద్దా? అన్నదానిపై విపక్షాలు ఓటింగ్ కోరాయి. దీంతో అనుకూలంగా 207, వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుతో సహా మూడు బిల్లులకు అనుకూలంగా 207 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇంత హఠాత్తుగా బిల్లులు తీసుకొచ్చారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
ఇక నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్తో సహా మూడు బిల్లులపై రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఓటు హక్కు రాజకీయ న్యాయమేనని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మూడు బిల్లులూ చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. విధాన రూపకల్పనలో మహిళల పాత్ర అత్యంత అవసరం అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Beach: హద్దులు దాటిన జంట.. అందరూ చూస్తుండగా బీచ్లో అసభ్య ప్రవర్తన
తాజావార్తలు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్లో రెండో రౌండ్కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?