Jamshedpur: ప్రేమ నిరాకరించిన తల్లిదండ్రులు.. సుత్తితో కొట్టి చంపిన కూతురు
Teen her 37 year old boyfriend kill parents with hammer cooker cops: ప్రేమ పేరుతో యువతులపై కొందరు దాడులకు పాల్పడుతుంటే, మరి కొందరు వారి ప్రేమకు అడ్డు పడుతున్న కనీపెంచిన తల్లిదండ్రులనే హతమార్చేందుకు సిద్దపడుతున్నారు. ఆమె వయస్సు 15 ఏళ్లు తన కంటే పెద్దవాడైన 37 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది. నిరాకరించిన తల్లిదండ్రులను అతికిరాతంగా ప్రియుడితో కలిసి హతమార్చించి ఈ ఘటన జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో చోటుచేసుకుంది.
జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లా జంషెడ్పూర్ లోని మానిఫిట్ కు చెందిన 15 ఏళ్ల యువతి, తనకంటే ఎక్కువ వయస్సు వున్న 37 వ్యక్తిని ప్రేమించింది. దీంతో తల్లిదండ్రులు ఎక్కడ ఆ కూతురు చేయరాని తప్పు చేస్తుందో అని భయపడ్డారు. దీంతో కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన వారు అలాంటి తప్పు చేయెద్దని కూతురుని మందలించారు. కానీ ఆకూతురు అతని వ్యామోహంలో పడిపోయిందని గ్రహించిన తల్లిదండ్రులు తీవ్రంగా ఖండించారు. దీంతో ఎలాగైనా తన ప్రియుడితో పారిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసారు వారిద్దరు. అర్దరాత్రి ప్రియురాలి ఇంటి వద్దకు వచ్చిన ఆవ్యక్తి తనను తీసుకు వెల్లేందుకు ప్రయత్నించగా, నిద్ర నుంచి మేలుకున్న తల్లిదండ్రులపై ప్రియుడు, కూతురు దాడి చేసారు.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
read also: Astrology : ఆగస్టు 10, బుధవారం దినఫలాలు
సుత్తి, ప్రెషర్ కుక్కర్ తో వారిని దారుణంగా కొట్టారు. రక్తం కారుతున్నా కనికరం చూపలేదు. సుత్తితో అతి క్రూరంగా వారి తలపై కొట్టి అక్కడినుంచి స్కూటీపై పరాయ్యారు. మరుసటి రోజు (సోమవారం) ఉదయం ఇంటి ప్రధాన గేటు తెరిచి ఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు ఇద్దరి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల కుమార్తె మిస్సింగ్ కేసుగా భావించారు. రక్తపు మడుగులో వున్న సుత్తి, ప్రెషర్ కుక్కర్ ను, స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు సూపరింటెండెంట్ (సిటీ) కె. విజయ్ శంకర్ ఘటనకు సంబందించిన వివరాలు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై సీరియస్ గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లో ఈ కేసు ఛేదించారు. విచారణలో ఖంగుతినే నిజాలు బయటకు రావడంతో.. షాక్ కు గురయ్యారు. తల్లిదండ్రులను హతమార్చింది కూతురు, అతని ప్రియుడే అని తేల్చిచేప్పారు. టెల్కో పోలీస్ స్టేషన్ పరిధిలోని మానిఫిట్ లో తల్లిదండ్రులు కొట్టి అక్కడునుంచి నిందితులు స్కూటీలో ఇద్దరు పరాయ్యారని పేర్కొన్నారు. బిర్సానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓమ్నగర్లోని ప్రియుడు అద్దెకు ఇంటిలో వున్నట్లు గమనించిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆమె ప్రియుడు అక్కడే వుండటంతో పోలీసులు వారిని అదుపులో తీసుకుని, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిపై 302 ఐపిసి పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!