CJI: కిందిస్థాయి కోర్టుల్లోనూ సాంకేతికత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJI: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే కాకుండా.. కిందిస్థాయి కోర్టుల్లో సైతం సాంకేతికతను ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కీలకమైన విచారణలను లైవ్ టెలీకాస్ట్ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆధునిక టెక్నాలజీని సుప్రీంకోర్టులోనే కాకుండా కిందిస్థాయి కోర్టుల్లోనూ వినియోగించేలా చేస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. ఆర్టికిల్ 370 రద్దుపై విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధునిక సాంకేతికతను మరింతగా వినియోగించుకుంటూ కింది స్థాయిలోని న్యాయస్థానాలను ‘టెక్–ఫ్రెండ్లీ’గా తయారుచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. గురువారం ఆర్టికిల్ 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ సమయంలో సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనల సమయంలో కింది కోర్టులు సాంకేతికతను పుంజుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అందుకు స్పందించిన సీజేఐ తప్పకుండా అటువంటి చర్యలు చేపడతామని.. ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఈ-కోర్టుల ప్రాజెక్ట్ యొక్క మూడవ దశ కోసం భారీ బడ్జెట్ను కేటాయించినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు ఇది సాంకేతికతతో న్యాయవ్యవస్థను.. ముఖ్యంగా దిగువ కోర్టులను సన్నద్ధం చేస్తుంది.
Read also: Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు!
Also Read
- India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
- UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
- Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
కరోనా మహమ్మారి సమయంలో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయినా న్యాయస్థానాలను ప్రతిరోజూ నడపాల్సి వచ్చిందన్నారు. ఈ–కోర్టుల ప్రాజెక్టు మూడో దశకు కేంద్రం కేటాయించిన భారీ బడ్జెట్ కారణంగా న్యాయవ్యవస్థ ముఖ్యంగా కింది కోర్టుల్లో సాంకేతిక పుంజుకొంటుందన్నారు. న్యాయస్థానాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ముఖ్యమైనదని గుర్తుచేశారు. “మహమ్మారి సమయంలో నాకు గుర్తుంది, వీడియో ప్లాట్ఫారమ్ కోసం లైసెన్స్ల కోసం చెల్లించడానికి వారి వద్ద డబ్బు లేదని నేను హైకోర్టు పేరు పెట్టను… మేము సుప్రీంకోర్టు నుండి కొన్ని లైసెన్సులను ఉపసంహరించుకున్నాము మరియు వారికి బదిలీ చేసాము… వారు పూర్తిగా భయంకరమైన స్థితిలో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లేకుండా కోర్టును నడపడం సాధ్యం కాదని సీజేఐ అన్నారు. రూ.7,000 కోట్లతో ఈ-కోర్టుల ప్రాజెక్టు మూడో దశకు ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ప్రకటించిందని తెలిపారు. ఫేజ్ 3లో భారీ బడ్జెట్ ఉంది… మేము ఆ పనిలో ఉన్నాము (లోయర్ కోర్ట్ టెక్నాలజీని స్నేహపూర్వకంగా మార్చడం). వీడియో కాన్ఫరెన్స్ కోసం మా స్వంత క్లౌడ్ సాఫ్ట్వేర్ను ఏర్పాటు చేస్తున్నామఅని
సీజేఐ తెలిపారు.
తాజావార్తలు
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!