CJI: కిందిస్థాయి కోర్టుల్లోనూ సాంకేతికత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJI: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే కాకుండా.. కిందిస్థాయి కోర్టుల్లో సైతం సాంకేతికతను ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కీలకమైన విచారణలను లైవ్ టెలీకాస్ట్ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆధునిక టెక్నాలజీని సుప్రీంకోర్టులోనే కాకుండా కిందిస్థాయి కోర్టుల్లోనూ వినియోగించేలా చేస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. ఆర్టికిల్ 370 రద్దుపై విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధునిక సాంకేతికతను మరింతగా వినియోగించుకుంటూ కింది స్థాయిలోని న్యాయస్థానాలను ‘టెక్–ఫ్రెండ్లీ’గా తయారుచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. గురువారం ఆర్టికిల్ 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ సమయంలో సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనల సమయంలో కింది కోర్టులు సాంకేతికతను పుంజుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అందుకు స్పందించిన సీజేఐ తప్పకుండా అటువంటి చర్యలు చేపడతామని.. ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఈ-కోర్టుల ప్రాజెక్ట్ యొక్క మూడవ దశ కోసం భారీ బడ్జెట్ను కేటాయించినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు ఇది సాంకేతికతతో న్యాయవ్యవస్థను.. ముఖ్యంగా దిగువ కోర్టులను సన్నద్ధం చేస్తుంది.
Read also: Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు!
Also Read
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
కరోనా మహమ్మారి సమయంలో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయినా న్యాయస్థానాలను ప్రతిరోజూ నడపాల్సి వచ్చిందన్నారు. ఈ–కోర్టుల ప్రాజెక్టు మూడో దశకు కేంద్రం కేటాయించిన భారీ బడ్జెట్ కారణంగా న్యాయవ్యవస్థ ముఖ్యంగా కింది కోర్టుల్లో సాంకేతిక పుంజుకొంటుందన్నారు. న్యాయస్థానాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ముఖ్యమైనదని గుర్తుచేశారు. “మహమ్మారి సమయంలో నాకు గుర్తుంది, వీడియో ప్లాట్ఫారమ్ కోసం లైసెన్స్ల కోసం చెల్లించడానికి వారి వద్ద డబ్బు లేదని నేను హైకోర్టు పేరు పెట్టను… మేము సుప్రీంకోర్టు నుండి కొన్ని లైసెన్సులను ఉపసంహరించుకున్నాము మరియు వారికి బదిలీ చేసాము… వారు పూర్తిగా భయంకరమైన స్థితిలో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లేకుండా కోర్టును నడపడం సాధ్యం కాదని సీజేఐ అన్నారు. రూ.7,000 కోట్లతో ఈ-కోర్టుల ప్రాజెక్టు మూడో దశకు ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ప్రకటించిందని తెలిపారు. ఫేజ్ 3లో భారీ బడ్జెట్ ఉంది… మేము ఆ పనిలో ఉన్నాము (లోయర్ కోర్ట్ టెక్నాలజీని స్నేహపూర్వకంగా మార్చడం). వీడియో కాన్ఫరెన్స్ కోసం మా స్వంత క్లౌడ్ సాఫ్ట్వేర్ను ఏర్పాటు చేస్తున్నామఅని
సీజేఐ తెలిపారు.
తాజావార్తలు
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..