CJI: కిందిస్థాయి కోర్టుల్లోనూ సాంకేతికత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJI: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే కాకుండా.. కిందిస్థాయి కోర్టుల్లో సైతం సాంకేతికతను ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కీలకమైన విచారణలను లైవ్ టెలీకాస్ట్ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆధునిక టెక్నాలజీని సుప్రీంకోర్టులోనే కాకుండా కిందిస్థాయి కోర్టుల్లోనూ వినియోగించేలా చేస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. ఆర్టికిల్ 370 రద్దుపై విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధునిక సాంకేతికతను మరింతగా వినియోగించుకుంటూ కింది స్థాయిలోని న్యాయస్థానాలను ‘టెక్–ఫ్రెండ్లీ’గా తయారుచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. గురువారం ఆర్టికిల్ 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ సమయంలో సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనల సమయంలో కింది కోర్టులు సాంకేతికతను పుంజుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అందుకు స్పందించిన సీజేఐ తప్పకుండా అటువంటి చర్యలు చేపడతామని.. ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఈ-కోర్టుల ప్రాజెక్ట్ యొక్క మూడవ దశ కోసం భారీ బడ్జెట్ను కేటాయించినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు ఇది సాంకేతికతతో న్యాయవ్యవస్థను.. ముఖ్యంగా దిగువ కోర్టులను సన్నద్ధం చేస్తుంది.
Read also: Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు!
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
కరోనా మహమ్మారి సమయంలో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయినా న్యాయస్థానాలను ప్రతిరోజూ నడపాల్సి వచ్చిందన్నారు. ఈ–కోర్టుల ప్రాజెక్టు మూడో దశకు కేంద్రం కేటాయించిన భారీ బడ్జెట్ కారణంగా న్యాయవ్యవస్థ ముఖ్యంగా కింది కోర్టుల్లో సాంకేతిక పుంజుకొంటుందన్నారు. న్యాయస్థానాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ముఖ్యమైనదని గుర్తుచేశారు. “మహమ్మారి సమయంలో నాకు గుర్తుంది, వీడియో ప్లాట్ఫారమ్ కోసం లైసెన్స్ల కోసం చెల్లించడానికి వారి వద్ద డబ్బు లేదని నేను హైకోర్టు పేరు పెట్టను… మేము సుప్రీంకోర్టు నుండి కొన్ని లైసెన్సులను ఉపసంహరించుకున్నాము మరియు వారికి బదిలీ చేసాము… వారు పూర్తిగా భయంకరమైన స్థితిలో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లేకుండా కోర్టును నడపడం సాధ్యం కాదని సీజేఐ అన్నారు. రూ.7,000 కోట్లతో ఈ-కోర్టుల ప్రాజెక్టు మూడో దశకు ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ప్రకటించిందని తెలిపారు. ఫేజ్ 3లో భారీ బడ్జెట్ ఉంది… మేము ఆ పనిలో ఉన్నాము (లోయర్ కోర్ట్ టెక్నాలజీని స్నేహపూర్వకంగా మార్చడం). వీడియో కాన్ఫరెన్స్ కోసం మా స్వంత క్లౌడ్ సాఫ్ట్వేర్ను ఏర్పాటు చేస్తున్నామఅని
సీజేఐ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!