తమిళనాడు గవర్నర్ అర్లేకర్ మళ్లీ విజయ్కు ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి దాకా మ్యాజిక్ ఫిగర్ లేదని మూడు సార్లు వెనక్కి పంపిన గవర్నర్.. తాజాగా సంపూర్ణ బలం వచ్చాక కలిసేందుకు నిరాకరించారు. గవర్నర్ను కలిసేందుకు లోక్భవన్కు వెళ్లిన విజయ్కు చేదు అనుభవం ఎదురైంది. గవర్నర్ అయిపాయింట్ ఇవ్వకపోవడంతో లోక్భవన్ దాకా వెళ్లి తిరిగి టీవీకే కార్యాలయానికి వచ్చేశారు.
ఈ రాత్రి 7:30కు కేరళం వెళ్లేందుకు గవర్నర్ అర్లేకర్ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ముందస్తు అపాయింట్మెంట్లు ఉండడంతో విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయినట్లుగా లోక్భవన్ కార్యాలయం చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంపై టీవీకే అభిమానులు, నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ కావాలనే గేమ్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా విజయ్ బలం వీసీకే, ముస్లిం లీగ్ పార్టీల మద్దతు 120కి చేరింది. ఆ పార్టీలు సంపూర్ణ మద్దతు తెల్పాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో విజయ్కు అపాయింట్మెంట్ నిరాకరించడంతో అంతా అవాక్కయ్యారు.
