Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- సీఎం విజయ్ కీలక నిర్ణయం
- ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- మారుమూల గ్రామాల్లో కూడా తిరగనున్న బస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకరణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో కొనుగోలు చేసే అన్ని కొత్త ప్రభుత్వ బస్సులు ఎయిర్ కండీషన్డ్ (AC) బస్సులే ఉంటాయని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ వెల్లడించారు. ప్రజలు మరింత సౌకర్యవంతంగా.. ఎక్కువ దూరాలు ప్రయాణించేలా ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నదే సీఎం విజయ్ లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఆదివారం సేలంలో అధికార పార్టీ టీవీకే (TVK) నిర్వహించిన కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థిబన్.. తమిళనాడులోని మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ సౌకర్యంగా ప్రయాణించేందుకు అవసరమైన అన్ని వసతులతో బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం భావిస్తున్నారని వివరించారు.
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
ఇటీవల ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ఒక ప్రభుత్వ బస్సులో ప్రయాణించిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి.. ఆ ప్రయాణం తర్వాత కొత్తగా కొనుగోలు చేసే ప్రతి ప్రభుత్వ బస్సులో ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం ఉండాలని సీఎం సూచించారని తెలిపారు. గత వారం ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రవ్యాప్తంగా 300 కొత్త ప్రభుత్వ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బస్సు కండక్టర్తో మాట్లాడి ప్రయాణికులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. రూ.127.21 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ 300 బస్సుల్లో 164 డీజిల్ బస్సులు, 136 BS-VI ప్రమాణాలకు అనుగుణమైన సీఎన్జీ బస్సులు ఉన్నాయి. వీటిని చెన్నైలోని కోయంబేడు, కిలాంబాక్కం వంటి ప్రధాన బస్ టెర్మినళ్ల నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతూ ప్రయాణికుల రద్దీని తగ్గించడం, అనుసంధానాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజా రవాణాను ఆధునీకరించడం, రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన అనుసంధానం కల్పించడం, ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!