Tamil Nadu: కోవిడ్ ఆంక్షలు.. తమిళనాడు కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.. తాజాగా 3,086 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరోవైపు.. కోవిడ్ ఆంక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది స్టాలిన్ సర్కార్.. ఈ నెల 16 నుంచి మరిన్ని కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయన్నారు.. అయితే లాక్డౌన్ నిబంధనలను మాత్రం మార్చి 2వ తేదీ వరకు కొనసాగనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. తమిళనాడు ఇప్పుడు కిండర్ గార్టెన్ మరియు ప్లే స్కూల్లను తిరిగి తెరవడానికి అనుమతించింది. కొత్త నిబంధనలలో భాగంగా ప్రదర్శనలు కూడా నిర్వహించవచ్చు. రోజువారీ ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Read Also: AP Special Status: ఏపీకి కేంద్రం షాక్.. ప్రత్యేక హోదా తొలగింపు..!
Also Read
- Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
- BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
- West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
- Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
ఇవాళ సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.. ఈ తర్వాత ఈ నిర్ణయాలను వెల్లడించారు.. థియేటర్లు, హోటళ్లు, మాల్స్, జిమ్స్, లాడ్జీలు, బట్టల దుకాణం, జ్యువెలరీ దుకాణం, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.. గతంలో పేర్కొన్న ఆంక్షలన్నింటినీ ఎత్తేస్తున్నట్లు స్పష్టం చేసింది.. అయితే, రద్దీ ఎక్కువగా ఉండే సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక సమావేశాలపై నిషేధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే, వివాహాలు మరియు సంబంధిత కార్యక్రమాలకు గరిష్ట హాజరు 200కి పరిమితం చేయబడింది, అంత్యక్రియలకు పరిమితి 100 మాత్రమే. గతంలో 100 మంది వివాహాలకు మరియు అంత్యక్రియలకు 50 మందిని అనుమతించినప్పటికి ఇప్పుడు పరిమితిని పెంచారు. మిగతా అన్ని ఆంక్షలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది… గత ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు ఫిబ్రవరి 1న రాష్ట్రంలో పునఃప్రారంభమయ్యాయి. రెస్టారెంట్లు, ఇతర తినుబండారాలు, లాడ్జీలు, వస్త్రాలు మరియు ఆభరణాల దుకాణాలు మరియు థియేటర్లు, సినిమాహాళ్ళు మరియు మల్టీప్లెక్స్లు వంటి ఇతర వాణిజ్య సంస్థలు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రం ఇటీవల రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ మరియు ఆదివారాల్లో పూర్తి లాక్డౌన్ను కూడా ఉపసంహరించుకుంది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
-
CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
-
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
-
Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
-
Vaibhav Sooryavanshi Earnings: ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!