Tamil Nadu: కోవిడ్ ఆంక్షలు.. తమిళనాడు కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.. తాజాగా 3,086 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరోవైపు.. కోవిడ్ ఆంక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది స్టాలిన్ సర్కార్.. ఈ నెల 16 నుంచి మరిన్ని కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయన్నారు.. అయితే లాక్డౌన్ నిబంధనలను మాత్రం మార్చి 2వ తేదీ వరకు కొనసాగనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. తమిళనాడు ఇప్పుడు కిండర్ గార్టెన్ మరియు ప్లే స్కూల్లను తిరిగి తెరవడానికి అనుమతించింది. కొత్త నిబంధనలలో భాగంగా ప్రదర్శనలు కూడా నిర్వహించవచ్చు. రోజువారీ ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Read Also: AP Special Status: ఏపీకి కేంద్రం షాక్.. ప్రత్యేక హోదా తొలగింపు..!
Also Read
- Vietnam Boat Tragedy: నేడు భారత్కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
- ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
ఇవాళ సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.. ఈ తర్వాత ఈ నిర్ణయాలను వెల్లడించారు.. థియేటర్లు, హోటళ్లు, మాల్స్, జిమ్స్, లాడ్జీలు, బట్టల దుకాణం, జ్యువెలరీ దుకాణం, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.. గతంలో పేర్కొన్న ఆంక్షలన్నింటినీ ఎత్తేస్తున్నట్లు స్పష్టం చేసింది.. అయితే, రద్దీ ఎక్కువగా ఉండే సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక సమావేశాలపై నిషేధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే, వివాహాలు మరియు సంబంధిత కార్యక్రమాలకు గరిష్ట హాజరు 200కి పరిమితం చేయబడింది, అంత్యక్రియలకు పరిమితి 100 మాత్రమే. గతంలో 100 మంది వివాహాలకు మరియు అంత్యక్రియలకు 50 మందిని అనుమతించినప్పటికి ఇప్పుడు పరిమితిని పెంచారు. మిగతా అన్ని ఆంక్షలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది… గత ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు ఫిబ్రవరి 1న రాష్ట్రంలో పునఃప్రారంభమయ్యాయి. రెస్టారెంట్లు, ఇతర తినుబండారాలు, లాడ్జీలు, వస్త్రాలు మరియు ఆభరణాల దుకాణాలు మరియు థియేటర్లు, సినిమాహాళ్ళు మరియు మల్టీప్లెక్స్లు వంటి ఇతర వాణిజ్య సంస్థలు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రం ఇటీవల రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ మరియు ఆదివారాల్లో పూర్తి లాక్డౌన్ను కూడా ఉపసంహరించుకుంది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Fahadh Faasil: ‘పుష్ప 2’ తర్వాత ఫహద్ ఫాసిల్ మరో సర్ప్రైజ్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్తో భారీ హైప్
-
Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్తో తలపై కొట్టడంతో భర్త మృతి..
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!