Tamil Nadu: కోవిడ్ ఆంక్షలు.. తమిళనాడు కీలక నిర్ణయం..
తమిళనాడులో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.. తాజాగా 3,086 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరోవైపు.. కోవిడ్ ఆంక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది స్టాలిన్ సర్కార్.. ఈ నెల 16 నుంచి మరిన్ని కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయన్నారు.. అయితే లాక్డౌన్ నిబంధనలను మాత్రం మార్చి 2వ తేదీ వరకు కొనసాగనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. తమిళనాడు ఇప్పుడు కిండర్ గార్టెన్ మరియు ప్లే స్కూల్లను తిరిగి తెరవడానికి అనుమతించింది. కొత్త నిబంధనలలో భాగంగా ప్రదర్శనలు కూడా నిర్వహించవచ్చు. రోజువారీ ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Read Also: AP Special Status: ఏపీకి కేంద్రం షాక్.. ప్రత్యేక హోదా తొలగింపు..!
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
ఇవాళ సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.. ఈ తర్వాత ఈ నిర్ణయాలను వెల్లడించారు.. థియేటర్లు, హోటళ్లు, మాల్స్, జిమ్స్, లాడ్జీలు, బట్టల దుకాణం, జ్యువెలరీ దుకాణం, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.. గతంలో పేర్కొన్న ఆంక్షలన్నింటినీ ఎత్తేస్తున్నట్లు స్పష్టం చేసింది.. అయితే, రద్దీ ఎక్కువగా ఉండే సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక సమావేశాలపై నిషేధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే, వివాహాలు మరియు సంబంధిత కార్యక్రమాలకు గరిష్ట హాజరు 200కి పరిమితం చేయబడింది, అంత్యక్రియలకు పరిమితి 100 మాత్రమే. గతంలో 100 మంది వివాహాలకు మరియు అంత్యక్రియలకు 50 మందిని అనుమతించినప్పటికి ఇప్పుడు పరిమితిని పెంచారు. మిగతా అన్ని ఆంక్షలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది… గత ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు ఫిబ్రవరి 1న రాష్ట్రంలో పునఃప్రారంభమయ్యాయి. రెస్టారెంట్లు, ఇతర తినుబండారాలు, లాడ్జీలు, వస్త్రాలు మరియు ఆభరణాల దుకాణాలు మరియు థియేటర్లు, సినిమాహాళ్ళు మరియు మల్టీప్లెక్స్లు వంటి ఇతర వాణిజ్య సంస్థలు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రం ఇటీవల రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ మరియు ఆదివారాల్లో పూర్తి లాక్డౌన్ను కూడా ఉపసంహరించుకుంది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?