Tamil Nadu: కోవిడ్ ఆంక్షలు.. తమిళనాడు కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.. తాజాగా 3,086 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరోవైపు.. కోవిడ్ ఆంక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది స్టాలిన్ సర్కార్.. ఈ నెల 16 నుంచి మరిన్ని కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయన్నారు.. అయితే లాక్డౌన్ నిబంధనలను మాత్రం మార్చి 2వ తేదీ వరకు కొనసాగనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. తమిళనాడు ఇప్పుడు కిండర్ గార్టెన్ మరియు ప్లే స్కూల్లను తిరిగి తెరవడానికి అనుమతించింది. కొత్త నిబంధనలలో భాగంగా ప్రదర్శనలు కూడా నిర్వహించవచ్చు. రోజువారీ ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Read Also: AP Special Status: ఏపీకి కేంద్రం షాక్.. ప్రత్యేక హోదా తొలగింపు..!
Also Read
- Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
- PM Modi: ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి.. వివాటెక్ ఈవెంట్లో పాల్గొన్న మోడీ
- Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
- Modi-Trump: జీ7 వేదికగా మోడీతో దిగిన ఆసక్తికర ఫొటో షేర్ చేసిన ట్రంప్
ఇవాళ సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.. ఈ తర్వాత ఈ నిర్ణయాలను వెల్లడించారు.. థియేటర్లు, హోటళ్లు, మాల్స్, జిమ్స్, లాడ్జీలు, బట్టల దుకాణం, జ్యువెలరీ దుకాణం, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.. గతంలో పేర్కొన్న ఆంక్షలన్నింటినీ ఎత్తేస్తున్నట్లు స్పష్టం చేసింది.. అయితే, రద్దీ ఎక్కువగా ఉండే సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక సమావేశాలపై నిషేధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే, వివాహాలు మరియు సంబంధిత కార్యక్రమాలకు గరిష్ట హాజరు 200కి పరిమితం చేయబడింది, అంత్యక్రియలకు పరిమితి 100 మాత్రమే. గతంలో 100 మంది వివాహాలకు మరియు అంత్యక్రియలకు 50 మందిని అనుమతించినప్పటికి ఇప్పుడు పరిమితిని పెంచారు. మిగతా అన్ని ఆంక్షలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది… గత ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు ఫిబ్రవరి 1న రాష్ట్రంలో పునఃప్రారంభమయ్యాయి. రెస్టారెంట్లు, ఇతర తినుబండారాలు, లాడ్జీలు, వస్త్రాలు మరియు ఆభరణాల దుకాణాలు మరియు థియేటర్లు, సినిమాహాళ్ళు మరియు మల్టీప్లెక్స్లు వంటి ఇతర వాణిజ్య సంస్థలు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రం ఇటీవల రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ మరియు ఆదివారాల్లో పూర్తి లాక్డౌన్ను కూడా ఉపసంహరించుకుంది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు.. దక్షిణ లెబనాన్పై చర్యలు కొనసాగుతాయన్న ఇజ్రాయెల్
-
CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
-
Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
-
CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..