Priyank Kharge: ‘‘ఖర్గే ఫ్యామిలీపై రజాకార్ దాడి’’.. యోగి వ్యాఖ్యలపై స్పందించిన ఖర్గే కుమారుడు..
- యోగి ‘‘రజాకార్’’ వ్యాఖ్యలపై స్పందించిన ఖర్గే కుమారుడు..
- తన తండ్రి వ్యక్తిగత విషాదాన్ని రాజకీయాలకు వాడుకోలేదన్న ప్రియాంక్ ఖర్గే..
- మల్లికార్జున ఖర్గే.. యోగి మధ్య మాటల యుద్ధంపై ప్రియాంక్ ఖర్గే కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyank Kharge: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే గతాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాం హయాంలో అప్పటి హైదరాబాద్ ప్రాంతంలోని ఖర్గే గ్రామంపై రజాకార్లు దాడి చేసి, ఖర్గే ఇంటిని కాల్చిన సంగతిని గుర్తు చేశారు. ఈ ఘటనలో ఖర్గే తల్లితో పాటు ఆయన కుటుంబం కూడా మరణించారు. ఈ విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ చెబుతూ.. తన కుటుంబ త్యాగాన్ని మరిచి ఖర్గే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై ఖర్గే కుమారుడు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. వ్యక్తిగత విషాదాన్ని ‘‘రాజకీయ లబ్ధి’’ కోసం
తన తండ్రి ఎప్పుడూ ఉపయోగించుకోలేదని అన్నారు. ‘‘సాధువుల వేషంలో ఉన్న వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలి’’ అని మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా యోగి ‘‘రజాకార్ దాడి’’ గురించి గుర్తు చేశారు.
Also Read
- CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
Read Also: Alexei Zimin: రష్యా సెలిబ్రిటీ చెఫ్, పుతిన్ విమర్శకుడు అనుమానాస్పద మృతి..
ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. ఈ విషాద ఘటనలో తన తండ్రి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, 9 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రి, ప్రతిపక్ష నేతగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగారని అన్నారు. ‘‘ఈ విషాదం జరిగినప్పటికీ, ఖర్గే ఎప్పుడూ దానిని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోలేదు. బాధితుడిని అని ఎప్పుడూ సింపతీ కోసం ట్రై చేయలేదు.’’ అని ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఖర్గే కుటుంబంపై దాడి చేసింది రజాకార్లు, మొత్తం ముస్లిం సమాజం కాదని కర్ణాటక మంత్రి అన్నారు.
బుద్ధుడు-బసవన్న-అంబేద్కర్ల విలువలను కాపాడేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు 82 ఏళ్ల కాంగ్రెస్ అధినేత అలుపెరగని పోరాటం చేస్తున్నారని ప్రియాంక్ ఖర్గే అన్నారు. యోగి జీ మీ ద్వేషాన్ని వేరే చోటుకి తీసుకెళ్లండి, రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో విద్వేషాన్ని నాటడానికి ప్రయత్నించే బదులుగా పీఎం మోడీ అభివృద్ధిపై చర్చించి గెలవండి అంటూ సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!