Priyank Kharge: ‘‘ఖర్గే ఫ్యామిలీపై రజాకార్ దాడి’’.. యోగి వ్యాఖ్యలపై స్పందించిన ఖర్గే కుమారుడు..
- యోగి ‘‘రజాకార్’’ వ్యాఖ్యలపై స్పందించిన ఖర్గే కుమారుడు..
- తన తండ్రి వ్యక్తిగత విషాదాన్ని రాజకీయాలకు వాడుకోలేదన్న ప్రియాంక్ ఖర్గే..
- మల్లికార్జున ఖర్గే.. యోగి మధ్య మాటల యుద్ధంపై ప్రియాంక్ ఖర్గే కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyank Kharge: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే గతాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాం హయాంలో అప్పటి హైదరాబాద్ ప్రాంతంలోని ఖర్గే గ్రామంపై రజాకార్లు దాడి చేసి, ఖర్గే ఇంటిని కాల్చిన సంగతిని గుర్తు చేశారు. ఈ ఘటనలో ఖర్గే తల్లితో పాటు ఆయన కుటుంబం కూడా మరణించారు. ఈ విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ చెబుతూ.. తన కుటుంబ త్యాగాన్ని మరిచి ఖర్గే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై ఖర్గే కుమారుడు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. వ్యక్తిగత విషాదాన్ని ‘‘రాజకీయ లబ్ధి’’ కోసం
తన తండ్రి ఎప్పుడూ ఉపయోగించుకోలేదని అన్నారు. ‘‘సాధువుల వేషంలో ఉన్న వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలి’’ అని మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా యోగి ‘‘రజాకార్ దాడి’’ గురించి గుర్తు చేశారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Alexei Zimin: రష్యా సెలిబ్రిటీ చెఫ్, పుతిన్ విమర్శకుడు అనుమానాస్పద మృతి..
ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. ఈ విషాద ఘటనలో తన తండ్రి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, 9 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రి, ప్రతిపక్ష నేతగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగారని అన్నారు. ‘‘ఈ విషాదం జరిగినప్పటికీ, ఖర్గే ఎప్పుడూ దానిని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోలేదు. బాధితుడిని అని ఎప్పుడూ సింపతీ కోసం ట్రై చేయలేదు.’’ అని ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఖర్గే కుటుంబంపై దాడి చేసింది రజాకార్లు, మొత్తం ముస్లిం సమాజం కాదని కర్ణాటక మంత్రి అన్నారు.
బుద్ధుడు-బసవన్న-అంబేద్కర్ల విలువలను కాపాడేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు 82 ఏళ్ల కాంగ్రెస్ అధినేత అలుపెరగని పోరాటం చేస్తున్నారని ప్రియాంక్ ఖర్గే అన్నారు. యోగి జీ మీ ద్వేషాన్ని వేరే చోటుకి తీసుకెళ్లండి, రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో విద్వేషాన్ని నాటడానికి ప్రయత్నించే బదులుగా పీఎం మోడీ అభివృద్ధిపై చర్చించి గెలవండి అంటూ సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!