Suvendu Adhikari: రాజీనామా చేయనన్న మమత ప్రకటనపై సువేందు అధికారి ఏమన్నారంటే..!
- రాజీనామా చేయనన్న మమత
- ఘాటుగా స్పందిస్తున్న బీజేపీ నేతలు
- రాజ్యాంగం ఏం చెబుతుందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని మమతా బెనర్జీ మొండికేశారు. ‘‘ఎన్నికల్లో ఓడిపోలేదని.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. లోక్భవన్కు కూడా వెళ్లను.’’ అని ప్రకటించారు. మమత చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రస్తుతం మమత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇక ఇదే అంశంపై సువేందు అధికారి స్పందించారు. ‘‘ఆమె (మమతా బెనర్జీ) ఏం చెబుతున్నారో నాకు తెలియదు. కానీ నేను చెప్పేది ఒక్కటే. అన్నీ రాజ్యాంగంలో రాసి ఉన్నాయి. అంతకు మించి నేను ఏమీ చెప్పనవసరం లేదు.’’ అని అన్నారు. 294 స్థానాలకు గాను 207 స్థానాలు గెలుచుకుని బీజేపీ అది పెద్ద శక్తిగా నిలిచింది. అయితే మర్యాదగా మమత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ చేయనని భీష్మించుకుని కూర్చున్నారు.
Also Read
- CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
- Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
- India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
గవర్నర్ అధికారాలివే..
ఒకవేళ ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోతే గవర్నర్కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. గవర్నర్ ముందుగా ఓడిపోయిన ముఖ్యమంత్రి రాజీనామాను కోరవచ్చు. నిరాకరిస్తే.. అసెంబ్లీని తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వు జారీ చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో గవర్నర్ ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించవచ్చు. ఒకవేళ ముఖ్యమంత్రి ఏదైనా చర్య తీసుకున్నా లేదా పెద్ద సంక్షోభం తలెత్తినా గవర్నర్ ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు. రాష్ట్రాల్లో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన సందర్భాల్లో ఇది జరుగుతుంది. అయితే పశ్చిమ బెంగాల్ విషయంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది.
కొత్త ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది?
ఆర్టికల్ 164 ప్రకారం.. కొత్త ముఖ్యమంత్రిని నియమించి.. ప్రమాణ స్వీకారం చేయించే అధికారం గవర్నర్కు ఉంది. ఎన్నికలలో ఓడిపోయిన ప్రభుత్వాన్ని.. ముఖ్యమంత్రిని తొలగించిన తర్వాత గవర్నర్ శాసనసభ పక్ష నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవచ్చు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. దీని అర్థం.. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోయినా.. ప్రజా తీర్పు తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగలేరు.
దిలీప్ ఘోష్…
మమతా బెనర్జీ ప్రకటనపై బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ కూడా స్పందించారు. మమతా బెనర్జీ అపరిపక్వంగా, చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారని, అలా ప్రవర్తించడం ఆమె నైజమన్నారు. ఈ ఆట ముగియక తప్పదని పేర్కొన్నారు. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంలో బీజేపీకి పద్ధతి ఉందన్నారు. ఆ వ్యక్తి ఎప్పుడూ మనం ఊహించని వారై, ఆశ్చర్యాన్ని కలిగిస్తారని తెలిపారు.
మమత ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తేలేదని మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మమత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఓడిపోలేదు.. రాజీనామా చేయను. లోక్భవన్కు వెళ్లి గవర్నర్ను కూడా కలవను. తన ఓటమికి ఎన్నికల సంఘమే కారణం. 100 సీట్లను బీజేపీ దొంగిలించింది. కౌంటింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు తనపై దాడి కూడా జరిగింది.’’ అని మమత ఆరోపించారు.
తాజావార్తలు
-
July Releases : జూలై బాక్స్ ఆఫీస్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆరుగురు హీరోలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!