Suprem Court: మణిపూర్ హింసపై సుప్రీం సీరియస్.. పూర్తి వివరాలతో రేపు హాజరవ్వాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suprem Court: మణిపూర్లో రెండు జాతుల మధ్య హంస ఇప్పటికీ కొనసాగుతోంది. మణిపూర్లో మహిళలపై జరిగిన ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. విచారణ సందర్బంగా దేశంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, హింసాత్మక ఘటనపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మణిపూర్ హింసపై ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీజేఐ ప్రశ్నించారు. విచారణ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించిన సీజేఐ.. మరిన్ని వివరాలతో రేపు విచారణకు హాజరు కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించి.. అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ సాగింది. బాధిత మహిళల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. మే 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు అలాంటి ఘటనలపై ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. మణిపూర్లో జరిగిన ఘటనకు చెందిన వీడియో ఒక్కటి వెలుగులోకి వచ్చిందని.. కానీ మహిళల పట్ల వేధింపులకు చెందిన ఎన్నో ఘటనలకు జరుగుతున్నాయని, ఇదొక్కటే ప్రత్యేకమైన ఘటన కాదన్నారు. మహిళల పట్ల జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు చాలా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని, ఇలాంటి అన్ని కేసుల్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని వాదనల సమయంలో సీజేఐ పేర్కొన్నారు.
Read also: Ketika Sharma: ఎద అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ ఈ భామే
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ఈ కేసులో సీబీఐ విచారణను బాధిత మహిళలు వ్యతిరేకిస్తున్నట్లు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. కేసును అస్సాంకు బదిలీ చేయడాన్ని కూడా వాళ్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం తరపున ఈ కేసులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసును అస్సాంకు బదిలీ చేయాలని తమ ప్రభుత్వం కోరలేదని సుప్రీంకోర్టుకు తెలిపారు. మణిపూర్ బయట ఈ అంశంపై విచారణ సాగాలని చెప్పినట్లు తుషార్ మెహతా పేర్కొన్నారు. ఇద్దరు బాధిత మహిళల్లో.. ఒకరి తండ్రి, సోదరుడిని హత్య చేసినట్లు కపిల్ సిబల్ ఆరోపించారు. వారికి చెందిన మృతదేహాలను ఇంకా గుర్తించలేదరి పేర్కొన్నారు. మే 18వ తేదీన ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న తర్వాతే ఆ కేసులో కదలిక వచ్చిందన్నారు. ఈ ఘటనను వ్యక్తిగత ఏజెన్సీ విచారణ చేపట్టాలని ఆయన సుప్రీంను కోరారు. ఈ కేసును సుప్రీంకోర్టు మానిటర్ చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తుషార్ మెహతా సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. ఇప్పటి వరకు 595 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. విచారణ సందర్భంగా మహిళలపై దాడి జరిగాక ఎఫ్ఐఆర్ నమోదుకు ఎందుకు ఆలస్యం అయిందని సీజేఐ ప్రశ్నించారు. నమోదు అయిన 5 వేల కేసుల్లో… ఏయే కేటగిరిలో ఎన్ని కేసులున్నాయని ప్రశ్నించారు. మొత్తంగా కేసుల్లో ఎందరిని అరెస్ట్ చేశారని..కోర్టుల్లో కేసుల పరిస్థితి ఏమిటనీ సీజేఐ ప్రశ్నించారు. మణిపూర్లో ఇద్దరు మహిళల వీడియోను తాను పరిశీలించానని.. అలాంటివి అక్కడ ఎన్ని జరిగినా ఈ వైరల్ వీడియో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిందన్నారు. మణిపూర్లో రెండు వర్గాల్లో బాధితులు ఉన్నారని సీజేఐ అన్నారు. మణిపూర్లో నమోదు చేసిన కేసుల్లో ఎన్ని లైంగిక హింస, హత్యకు చెందినవో స్పష్టంగా తెలియదని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టుకు తెలిపారు. రేప్ బాధిత మహిళలు.. మహిళలకు మాత్రమే తమ బాధను చెప్పుకోగలరని, అందుకే హైపవర్ మహిళా కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె సుప్రీంను కోరారు. మరిన్ని వివరాలతో రేపు విచారణకు హాజరు కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీజేఐ ఆదేశించారు.
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
-
Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
-
Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!