Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Supreme Court Slams Ec Over Bihar Voter List Revision

Bihar Elections: గుర్తింపు కార్డుల్లో ఆధార్ ఎందుకు చేర్చలేదు.. ఈసీని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం

Published Date :July 10, 2025 , 1:29 pm
By Suresh Maddala
  • బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర దుమారం
  • గుర్తింపు కార్డుల్లో ఆధార్ ఎందుకు చేర్చలేదు
  • ఈసీని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం
Bihar Elections: గుర్తింపు కార్డుల్లో ఆధార్ ఎందుకు చేర్చలేదు.. ఈసీని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడే విధంగా వ్యవహారిస్తోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది.

ఇది కూడా చదవండి: Senior Actress : సౌత్ ఇండస్ట్రీపై కన్నేసిన ఆ తల్లికూతుళ్లు

జూన్ 25న బీహార్‌లో ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం తర్వాతే రాజకీయ దుమారం చెలరేగింది. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహారిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా సవరణకు పూనుకుంది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంలో పది పిటిషన్లు దాఖలయ్యాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గురువారం ధర్మాసనం విచారణ చేపట్టగా.. ఈ సందర్భంగా పోల్ కసరత్తు సమయాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆధార్ కార్డును మినహాయించడంపై ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఈసీ తప్పనిసరి చేసిన 11 పత్రాల జాబితాలో ఆధార్ కార్డు ఎందుకు లేదనే దానిపై ప్రత్యక్ష సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘం నుంచి వివరణ కోరింది. 10 పిటిషన్లను న్యాయమూర్తులు సుధాంషు ధులియా, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారించింది.

ఇది కూడా చదవండి: Off The Record: రాజకీయంగా పార్టీలు వేరైనా.. దోచుకోవడానికి అందరు ఒకటేనా?

పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ.. అన్ని పిటిషన్ల వెనుక ప్రధాన కారణం ఆధార్ అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు (ECI)ను గణన పత్రాల జాబితా నుంచి తొలగించడమేనని తెలిపారు. కోర్టు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ.. ఈసీ తీరుతో అర్హత ఉన్న ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోవడమేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని, ప్రాథమిక నిర్మాణాన్ని నేరుగా దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు.

పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని న్యాయస్థానం తెలిపింది. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందని ధ్వజమెత్తింది. జూలై 25 కల్లా అధీకృత డాక్యుమెంట్లు చూపించకుంటే… ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. ఈ రివిజన్ వల్ల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకే ఈ కసరత్తు చేపట్టారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాలను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టారని ఆరోపణలు చేశాయి. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో స్పెషల్ రివిజన్ ఆపివేయాలని విపక్షాలు కోరాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తీరును ధర్మాసనం తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.

ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల కోసం ఈసీ తీవ్ర కసరత్తు చేస్తోందని.. బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. అనర్హుల పేర్లను తొలగించి, అర్హులైన పౌరులను మాత్రమే ఓటర్ల జాబితాలో చర్చడానికి రెండు దశాబ్దాలుగా తీవ్ర కసర్తు చేస్తున్నట్లు పోల్ బాడీ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారని జ్ఞానేష్ కుమార్ తెలిపారు.

అయితే బీహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రక్రియపై విపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా బీజేపీ రిగ్గింగ్ పాల్పడిందని.. ఇప్పుడు బీహార్‌లో కూడా అదే మాదిరిగా ఎన్డీఏ చేయబోతుందని ఆరోపించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bihar voter list revision
  • congress
  • EC
  • RJD
  • Supreme Court

తాజావార్తలు

  • Ration Dealers: రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ఇలా..

  • Hanuman Jayanti: రేపు హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

  • Carmeni Selvam: అప్పుల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే ‘కార్మేని సెల్వం’

  • Alwar Bride: పెళ్లైన నెలకే ఖిచిడీలో ఫినాయిల్ కలిపి అత్తకు పెట్టిన కొత్త కోడలు.. నగదు, నగలతో పరార్

  • Spoiled Meat: హైదరాబాద్‌లోని హోటల్స్‌లో ఇలాంటి మాంసాన్ని తింటున్నామా..? బాబోయ్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions