Supreme Court: దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- న్యాయవాదులకు సమన్లు జారీ చేయొద్దని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇవ్వడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. దర్యాప్తు సంస్థలు న్యాయవాదులకు సమన్లు జారీ చేయకూడదని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్.గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Bihar Elections: ‘సంకల్ప్ పత్ర’ పేరుతో కోటి ఉద్యోగాల హామీ ఇచ్చిన ఎన్డీఏ
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఇద్దరు న్యాయవాదులకు ఈడీ సమన్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు విచారించింది. నిందితుడి తరపున వాదించిన న్యాయవాదిని గుజరాత్ పోలీసులు పిలిచిన తర్వాత కేసును న్యాయస్థానం సుమోటాగా స్వీకరించింది. ఈ పరిణామం న్యాయవాద వృత్తి స్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తుందని.. అంతేకాకుండా న్యాయ నిర్వహణపై ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేవలం అసాధారణ పరిస్థితిలో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. బీఎస్ఏ సెక్షన్ 132 కింద అసాధారణ పరిస్థితిలో మాత్రమే న్యాయవాదులను పిలవాలని స్పష్టం చేసింది. క్లయింట్లకు ఇచ్చే సలహాలపై న్యాయవాదులను ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలేవి కూడా పిలవకూడదని ఆదేశించింది. నిందితుల తరఫున హాజరయ్యే న్యాయవాదులకు ఎట్టి పరిస్థితుల్లో సమన్లు జారీ చేయొద్దని సూచించింది. అలాగే న్యాయవాది నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజ్ కూడా కోర్టు ముందు మాత్రమే తెరవాలని ఆదేశించింది. ఇక ఈ పరిణామాన్ని న్యాయస్థానంతో పాటు బార్ కౌన్సిల్ కూడా తీవ్రంగా ఖండించింది. న్యాయవాదులకు ఈడీ సమన్లు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: నెహ్రూ వల్లే ఆ సమస్య వచ్చింది.. కాంగ్రెస్పై మండిపడ్డ మోడీ
ఇటీవల చీఫ్ జస్టిస్ గవాయ్ ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమయ్యాయి. విష్ణువు విగ్రహంపై గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అలాగే విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు.. భారత రాజ్యాంగం బుల్డోజర్ వ్యవస్థతో సాగదని వ్యాఖ్యానించారు. గవాయ్ చేసిన వ్యాఖ్యలు కొన్ని వర్గాలను నొప్పించడంతో ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో గవాయ్పై షూ విసిరేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా న్యాయవాదులకు సమన్లు జారీ చేయొద్దని ఆదేశించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఒక న్యాయమూర్తి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో భారీగా నోట్ల కట్టలు దొరికాయి. ఈ వ్యవహారంలో న్యాయమూర్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దారి తీసింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!