Supreme Court: సుప్రీంకోర్టు పనివేళలు మారతాయా?.. సీనియర్ జడ్జి కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీంకోర్ట్ పనివేళలు మారతాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ఇవాళ చేసిన వ్యాఖ్యలు ఇదే ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జడ్జిలు కేసులపై విచారణలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం ఓ గంట ముందే విచారణలు ప్రారంభించింది.
వాదనలు వినిపించేందుకు వచ్చిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ధర్మాసనం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీంతో జస్టిస్ లలిత్ స్పందిస్తూ.. ‘నా ఉద్దేశం ప్రకారం మనం రోజూ ఉదయం 9 గంటలకే విచారణలు ప్రారంభించొచ్చు. మన పిల్లలు పొద్దున్నే 7 గంటలకే స్కూల్కి వెళుతున్నప్పుడు మనం కనీసం 9 గంటలకైనా పని మొదలుపెట్టలేమా అని నాకెప్పుడూ అనిపిస్తుంటుంది’ అన్నారు. ‘నేనైతే.. ఈ రోజు మాదిరిగానే రోజూ చేయాలంటాను. కోర్టులు తెరిచేందుకు ఉదయం తొమ్మిదిన్నరే సరైన సమయమనిపిస్తోంది’ అని రోహత్గి కూడా జస్టిస్ లలిత్కి సపోర్ట్గా మాట్లాడారు.
Also Read
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
‘విచారణలను ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఎర్లీగానే ముగించొచ్చు. తర్వాతి రోజు విచారణకు రానున్న కేసుల ఫైల్స్ చదివేందుకు కూడా సమయం దొరుకుతుంది. ఉదయం 9 గంటలకు విధులను ఆరంభిస్తే పదకొండున్నరకు బ్రేక్ ఇవ్వొచ్చు. అర్ధ గంట బ్రేక్ తర్వాత మళ్లీ ప్రారంభించి మధ్యాహ్నం రెండు గంటల కల్లా ముగించొచ్చు. లంచ్ తర్వాత సాయంత్రం మరిన్ని పనులు చేసేందుకు న్యాయమూర్తులకు అదనపు సమయం లభిస్తుంది’ అని లలిత్ అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ లిస్టులో జస్టిస్ లలిత్ టాప్లో ఉన్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (ఆగస్ట్ 26న) రిటైర్ అయితే తదుపరి చీఫ్ జస్టిస్గా జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపడతారు. నవంబర్ 8 వరకు ఆ పదవిలో ఉంటారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లలిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన గనక సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ అయితే కొత్త పనివేళలకు తెరతీస్తారేమోననే టాక్ వినిపిస్తోంది.
తాజావార్తలు
-
KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..