Supreme Court: ఢిల్లీ వాయిు కాలుష్యం.. పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీం ఫైర్.. రైతులను విలన్లుగా చూపోద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాయి కాలుష్యంపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో రైతులను విలన్లుగా చిత్రీకరించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం పెరగడాన్ని అరికట్టాలని దాఖలైన పటిషన్పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై పంజాబ్ ప్రభుత్వం రైతులను కారణంగా చూపించింది. బహిరంగంగా పంట వ్యర్థాలను కాల్చడమే ఇందుకు కారణమని పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు రైతులకు మద్దతుగా వ్యవహరించింది.
Also Read: Uttar Pradesh: బెడ్రూం వీడియోలు బయటపెడతానని పోలీసుని బ్లాక్మెయిల్ చేసిన భార్య..
Also Read
రైతులు పంట వ్యర్థాలను కాల్చడానికి ఎన్నో కారణలు ఉండోచ్చని, వాటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వానిదని సుప్రీం కోర్టు మండిపడింది. ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘వాయు కాలుష్యంపై రైతులను విలన్లుగా చూపొద్దు. యంత్రాల ఉపయోగం, డిజిల్ ఖర్చులు వంటి కారణాలు వారికి ఉండోచ్చు. కానీ వ్యర్థాలు కాల్చకుండ అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలాదే. వాటినికి ప్రత్యామ్నయంగా ప్రభుత్వాలు ప్రోత్సహకాలు ప్రకటించవచ్చు కదా? దానికి మీరు ఏం చేస్తున్నారు’ అని సుప్రీం కోర్టు మండిపడింది.
Also Read: Father Killed Son: ఢిల్లీలో దారుణం.. భార్యతో గొడవ.. ఇద్దరు కొడుకుల గొంతు కోసిన తండ్రి.. ఆపై
ఈ విషయంలో యూపీ, ఢిల్లీ ప్రభుత్వాలు హర్యాయానను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొంది. యంత్రాంగానికి నిధులు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కోర్టు పేర్కొంది. కాలుష్యాన్ని తగ్గించడంలో నిందలు వేయడం వల్ల ప్రయోజనం ఉండదని తెలిపింది. కాగా ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు సుప్రీం కోర్టు పోరుగు రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలని చెప్పింది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడంపై నివేదిక ఇవ్వాలని యూపీ, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించి.. తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!