DY Chandrachud: నేను సీజేఐ చంద్రచూడ్ని, రూ. 500 పంపండి.. ప్రధాన న్యాయమూర్తి పేరుతో మెసేజ్లు..!
- సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ ను కూడా వదలని స్కామర్లు..
- ఓ వ్యక్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరుతో రూ. 500 అడిగిన వైనం..
- స్కామర్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DY Chandrachud: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ను కూడా స్కామర్లు వదల లేదు. ఆయన ఫొటో, ఆయన పేరుతో నకిలీ ఐడీ క్రియేట్ చేసి పలువురికి మెసెజ్ లు పెట్టిన డబ్బులు అడుగుతున్నారు. కాగా, ఇటీవల ఎక్స్ యూజర్ కైలాష్ మేఘ్వాల్ కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఫొటో, పేరుతో ఐడీ క్రియేట్ చేసిన ఒక స్కామర్ ఆ మెసేజ్ పంపించాడు. ఆ వ్యక్తి నుంచి తనకు వచ్చిన మెసేజ్ స్నాప్ షాట్ ను మేఘవాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆ సందేశంలో మోసగాడు తమను తాము సీజేఐగా పరిచయం చేసుకుని, తమకు అత్యవసర కొలీజియం మీటింగ్ ఉందని.. తాను ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో చిక్కుకున్నాను.. క్యాబ్ కు రూ.500 అవసరమని చెప్పుకొచ్చాడు.. కోర్టుకు వెళ్లిన తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని సీజేఐ పేరుతో వచ్చిన మెసేజ్ లో హామీ ఇచ్చారు. సందేశం చివరలో, స్కామర్ టెక్స్ట్ నిజమైనదిగా కనిపించడానికి “ఐప్యాడ్ నుంచి పంపబడింది” అనే మెసేజ్ ను కూడా జత చేశాడు.
Read Also: Earthquake: శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు.. జనం పరుగులు..
Also Read
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
అయితే, ఈ మెసేజ్ ను ఆగస్టు 25వ తేదీన ఎక్స్ లో కైలాష్ మేఘ్వాల్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కు ‘‘ఫ్రెండ్స్ ఏం చేయమంటారు?’’ అనే కామెంట్ ను జగ చేశాడు. ఆ పోస్ట్ కు 2 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. 2,500కు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది ఈ పోస్ట్ కు కామెంట్స్ సెక్షన్ లో తమ స్పందనలను తెలియజేశారు. ‘తాను చూపించిన అతి విశ్వాసానికి వెయ్యి రూపాయలు పంపండి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అతను దానిని ‘ఐప్యాడ్’ నుంచి పంపాడు.. కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధమైనదే’’ అని మరో యూజర్ పన్నీ కామెంట్స్ చేశారు. ఆ అభ్యర్థనను మరో మూడు వారాలకు వాయిదా వేయండి.. త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి తీర్పు ఇవ్వండి అంటూ మరొక నెటిజన్ పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
NTRNeel :’డ్రాగన్’ గ్లిమ్స్ అనుకున్న టైమ్ కంటే ఇంకాస్త ముందుగానే
-
Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
-
IPL 2026 playoff scenarios: నేడు కీలక మ్యాచ్.. సీఎస్కే-ఎస్ఆర్హెచ్ పోరుతో మారనున్న ప్లేఆఫ్స్ సమీకరణాలు!
-
Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
-
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..