DY Chandrachud: నేను సీజేఐ చంద్రచూడ్ని, రూ. 500 పంపండి.. ప్రధాన న్యాయమూర్తి పేరుతో మెసేజ్లు..!
- సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ ను కూడా వదలని స్కామర్లు..
- ఓ వ్యక్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరుతో రూ. 500 అడిగిన వైనం..
- స్కామర్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DY Chandrachud: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ను కూడా స్కామర్లు వదల లేదు. ఆయన ఫొటో, ఆయన పేరుతో నకిలీ ఐడీ క్రియేట్ చేసి పలువురికి మెసెజ్ లు పెట్టిన డబ్బులు అడుగుతున్నారు. కాగా, ఇటీవల ఎక్స్ యూజర్ కైలాష్ మేఘ్వాల్ కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఫొటో, పేరుతో ఐడీ క్రియేట్ చేసిన ఒక స్కామర్ ఆ మెసేజ్ పంపించాడు. ఆ వ్యక్తి నుంచి తనకు వచ్చిన మెసేజ్ స్నాప్ షాట్ ను మేఘవాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆ సందేశంలో మోసగాడు తమను తాము సీజేఐగా పరిచయం చేసుకుని, తమకు అత్యవసర కొలీజియం మీటింగ్ ఉందని.. తాను ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో చిక్కుకున్నాను.. క్యాబ్ కు రూ.500 అవసరమని చెప్పుకొచ్చాడు.. కోర్టుకు వెళ్లిన తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని సీజేఐ పేరుతో వచ్చిన మెసేజ్ లో హామీ ఇచ్చారు. సందేశం చివరలో, స్కామర్ టెక్స్ట్ నిజమైనదిగా కనిపించడానికి “ఐప్యాడ్ నుంచి పంపబడింది” అనే మెసేజ్ ను కూడా జత చేశాడు.
Read Also: Earthquake: శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు.. జనం పరుగులు..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
అయితే, ఈ మెసేజ్ ను ఆగస్టు 25వ తేదీన ఎక్స్ లో కైలాష్ మేఘ్వాల్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కు ‘‘ఫ్రెండ్స్ ఏం చేయమంటారు?’’ అనే కామెంట్ ను జగ చేశాడు. ఆ పోస్ట్ కు 2 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. 2,500కు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది ఈ పోస్ట్ కు కామెంట్స్ సెక్షన్ లో తమ స్పందనలను తెలియజేశారు. ‘తాను చూపించిన అతి విశ్వాసానికి వెయ్యి రూపాయలు పంపండి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అతను దానిని ‘ఐప్యాడ్’ నుంచి పంపాడు.. కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధమైనదే’’ అని మరో యూజర్ పన్నీ కామెంట్స్ చేశారు. ఆ అభ్యర్థనను మరో మూడు వారాలకు వాయిదా వేయండి.. త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి తీర్పు ఇవ్వండి అంటూ మరొక నెటిజన్ పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?