Srinagar: శ్రీనగర్-లేహ్ రహదారిపై భారీ హిమపాతం.. ఏడుగురు మృతి
- శ్రీనగర్పై కన్నెర్రజేసిన ప్రకృతి
- శ్రీనగర్-లేహ్ రహదారిపై భారీ హిమపాతం
- ఏడుగురు మృతి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీనగర్పై ప్రకృతి కన్నెర్రజేసింది. ఒక్కసారిగా భారీ హిమపాతం సృష్టించింది. శ్రీనగర్-లేహ్ రహదారిపై హిమసంపాతం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.. పలువురికి గాయాల పాలయ్యారు. ఇక పలు వాహనాలు హిమపాతంలో చిక్కుకుపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
శుక్రవారం మధ్యాహ్నం శ్రీనగర్-లేహ్ హైవేపై హిమసంపాతం జరిగినట్లుగా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే. సక్సేనా ఎక్స్లో పేర్కొన్నారు. తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
‘‘జోజి లా దగ్గర హిమసంపాతం సంభవించిన దురదృష్టకర వార్త విన్నాను. వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి, సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను ప్రారంభించాలని కార్గిల్ డీసీ, ఎస్ఎస్పీలను ఆదేశించాను. విపత్తు సహాయక దళాలు, బీఆర్ఓతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలను హై అలర్ట్లో ఉంచాను. నేను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను.’’ అని ఎక్స్ పోస్ట్లో లెప్టినెంట్ గవర్నర్ వీకే. సక్సేనా పేర్కొన్నారు.
హిమపాతంలో దాదాపు డజను కార్లు మంచు కింద కూరుకుపోయాయని.. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ట్వీట్ చేస్తూ.. ‘‘జోజిలా కనుమ దగ్గర వాహనంపై హిమపాతం విరుచుకుపడటంతో 7 మంది విషాదకరంగా మరణించడం, మరో 5 మంది గాయపడటం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాము.’’ అని తెలిపారు.

తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!