Site icon NTV Telugu

పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి..

కాన్పూర్‌లోని టాట్ మిల్ క్రాస్‌రోడ్ సమీపంలో ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పాదచారులపైకి దూసుకువచ్చిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో 15 మంది పాదచారులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. టాట్ మిల్ ఇంక్లైన్‌లో బస్సు బ్రేక్‌లు పనిచేయకపోవడంతో కార్లు, బైకులు, పాదచారులను ఢీకొట్టాయని కాన్పూర్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ప్రమోద్ కుమార్ తెలిపారు.

9 మంది పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించామని డీసీపీ వెల్లడించారు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసేందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్‌లో “కాన్పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి దురదృష్టకర వార్త అందింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు.

Exit mobile version