NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో ఆప్‌కు షాక్.. బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే తన్వార్

Bjp

Bjp

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వార్ ఆప్‌కు గుడ్‌బై చెప్పారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కమలనాథులు.. కర్తార్ సింగ్ మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆప్ ఎమ్మెల్యేతో పాటు బీఎస్పీ నేత రాజ్ కుమార్ ఆనంద్, ఆయన భార్య వీణా ఆనంద్, మరికొందరు నేతలు ఢిల్లీలో బీజేపీలో చేరారు. రాజ్ కుమార్ ఆనంద్… ఏప్రిల్‌లో ఆప్‌కి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా ప్రస్తుతం తీహార్  జైల్లో ఉన్నారు. సిసోడియా ఏడాది నుంచి జైల్లో ఉంటుండగా.. కేజ్రీవాల్ మూడు నెలల నుంచి ఉంటున్నారు. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. మరోవైపు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి.

ఇది కూడా చదవండి: BMW hit-and-run case: శివసేన నుంచి ‘హిట్ అండ్ రన్’ నిందితుడి తండ్రి సస్పెండ్..