Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతిపై సింగపూర్ పోలీసులు సంచలన రిపోర్ట్.. ఏం తేల్చారంటే..!
- జుబీన్ గార్గ్ మృతిపై సింగపూర్ పోలీసులు సంచలన రిపోర్ట్
- కీలక నివేదిక న్యాయస్థానానికి సమర్పణ
- ఇంకా స్పందించని భారత ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతి కేసులో కీలక రిపోర్టు బయటకు వచ్చింది. జుబీన్ గార్గ్ హత్యకు గురి కాలేదని సింగపూర్ పోలీసులు తేల్చారు. ఈ మేరకు కీలక నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. ఆయన్ను నీటిలో తోసేసినట్లుగానీ.. ఆత్మహత్య చేసుకున్నట్లుగానీ ఎక్కడా ఆధారాలు కనిపించలేదని తేల్చింది. జుబీన్ గార్గ్ మద్యం మత్తులో ఉన్నారని.. లైఫ్ జాకెట్ ధరించేందుకు నిరాకరించినట్లు నివేదికలో పేర్కొంది. ఈ మేరకు దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి అందజేసినట్లు సింగపూర్ మీడియా వెల్లడించింది.
‘‘నీటిలో ఈత కొట్టిన తర్వాత నౌకలోకి వచ్చేందుకు ప్రయత్నించడాన్ని సాక్షులు చూశారు. అస్వస్థతకు గురైనట్లు గుర్తించి వెంటనే నౌకలోకి తీసుకువచ్చినప్పటికీ కొన్ని గంటల తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు అధిక రక్తపోటు, మూర్ఛ వ్యాధి ఉందని తేలింది’’ అని నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షులు, బోట్ కెప్టెన్, వైద్య సిబ్బంది సహా మొత్తం 35 మందిని విచారించామని, జుబీన్ గార్గ్ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని గుర్తించామని సింగపూర్ పోలీసులు కోర్టుకు వెల్లడించారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ఇది కూడా చదవండి: Aishwarya Rai : ఆరాధ్యకు ఫోన్ లేదు.. ఐశ్వర్య రాయ్ కఠిన నిబంధనలు! అభిషేక్ బచ్చన్ షాకింగ్ రివీల్.
గతేడాది జుబీన్ గార్గ్ సింగపూర్లోని నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్కు వెళ్లారు. సెప్టెంబర్ 19, 2025న సముద్రంలో ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయారు. జుబీన్ గార్గ్ మరణంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. అస్సాంలో 60కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కేసును సిట్ దర్యాప్తు చేసింది. ఈ కేసులో మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఈవెంట్ నిర్వాహకుడు శ్యామ్కాను మహంత, బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, కో-సింగర్ అమృత్ప్రవ మహంతను అరెస్ట్ చేశారు. వీరిపై హత్య అభియోగాలు నమోదు చేశారు. ఇక అసెంబ్లీలో ముఖ్యమంత్రి హిమంత శర్మ మాట్లాడుతూ.. జుబీన్ గార్గ్ హత్యకు గురయ్యారని ప్రకటించారు.
తాజాగా సింగపూర్ పోలీసులు జుబీన్ గార్గ్ హత్యకు గురి కాలేదని తేల్చారు. ఈ రిపోర్ట్పై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. జుబీన్ గార్గ్ మరణవార్త అస్సామీయులను దిగ్భ్రాంతికి గురి చేసింది. లక్షలాది మంది జుబీన్ గార్గ్ను చూసేందుకు వచ్చారు.
ఇది కూడా చదవండి: Sharwanand: ఎట్టకేలకు హిట్ కొట్టిన శర్వానంద్!
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..