Shri Krishna Janmabhoomi Case: షాహీ ఈద్గా తొలగింపు కేసుపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఓవైపు జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. వారణాసి కోర్ట్ తో పాటు సుప్రీం కోర్ట్ లోొ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవల వారణాసి కోర్ట్ ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇందులో భాగంగా మసీదులోని ‘వాజు ఖానా’లో బావిలో శివలింగం బయటపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే సుప్రీం కోర్ట్ బయటపడిన శివలింగానికి రక్షణ ఇవ్వాలని వారణాసి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను మే 20కి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే మరోవైపు మరోకొత్త వివాదం ప్రారంభం అయింది. ఉత్తర్ ప్రదేశ్ మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా కేసును విచారించేందుకు మథుర కోర్ట్ నిర్ణయం తీసుకుంది. మథురలోని శ్రీ కృష్ణ జన్మస్థానంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న షాహీ ఈద్గాను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు మథుర కోర్ట్ అంగీకరించింది. కృష్ణుడి భక్తురాలు రంజనా అగ్నిహోత్రి రెండేళ్ల క్రితం ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి అనుబంధంగా మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
ఇదిలా ఉంటే ఈ వివాదంపై ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సుప్రీం కోర్ట్ తీర్పు, ప్రార్థనా స్థలాల చట్టం 1991ని మథుర కోర్ట్ ఉల్లంఘించిందని, పార్లమెంట్ చట్టానికి ఇది వ్యతిరేఖం అని అసదుద్దీన్ అన్నారు. జ్ఞానవాపి అయినా, మథుర అయినా ముస్లిం సమాజంపై మరింత ద్వేషం, అభద్రతా, హిందు సోదరుల్లో అపనమ్మకం వంటి వాతావరణాన్ని సృష్టించి, దేశాన్ని వెనక్కి తీసుకువెళ్లాలనే ఆలోచనలా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ వీటన్నింటికి స్వస్తి పలకాలని… సమాజాన్ని విభజించే ఇటువంటి చర్యలను సమర్థించబోమని చెప్పాల్సిన సమయం వచ్చిందని అసదుద్దీన్ అన్నారు. గతంలో జ్ఞానవాపి సమయంలో కూడా అసదుద్దీన్ కీలక వ్యాక్యలు చేశారు. గతంలో బాబ్రీ మసీదును కోల్పోయామని… జ్ఞానవాపిని కోల్పోవడానికి సిద్ధంగా లేమని అన్నారు.
తాజావార్తలు
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..