Lawrence Bishnoi: గత నెలలో ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సిద్ధిక్ తన కుమారుడు జీషన్ సిద్ధిక్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ కాల్చి చంపారు. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన శుభమ్ లోంకర్ ఖచ్చితంగా బిష్ణోయ్ గ్యాంగ్ కోసం పనిచేస్తునట్లు పోలీసుల విచారణలో తేలింది.