Site icon NTV Telugu

UP: ఏడు ప్రమాణాల తర్వాత షాకింగ్ ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి

Up9

Up9

ఉత్తరప్రదేశ్‌లోని ఓ వివాహ వేడుకలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. గ్రాండ్‌గా పెళ్లి జరుగుతోంది. హిందూ సాంప్రదాయ ప్రకారం ఏడు ప్రమాణాలు, ఆచారాలు కూడా పూర్తయ్యాయి. కొద్దిసేపటిలో వధువు మెడలో తాళి కడితే భార్యాభర్తలు కూడా అయిపోతారు. సరిగ్గా అదే సమయంలో ట్రాన్స్‌జెండర్లు ఎంట్రీ ఇచ్చారు. అంతే అప్పటి దాకా సందడిగా సాగిన పెళ్లి వేడుకలు కొద్దిసేపటికే నిశ్శబ్దంగా మారిపోయింది. వాళ్లను చూసి వరుడు, బంధువులు లగాయించారు. దీంతో పెళ్లిపీటల మీదనే తంతు ఆగిపోయింది. అసలేం జరిగింది. తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలోని కోఠి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో వివాహం జరుగుతోంది. ఆరు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. దీంతో ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయించుకున్నారు. బంధువులు, అతిథులంతా హాజరయ్యారు. ఏడు ప్రమాణాలు, ఆచరాలు కూడా పూర్తయ్యాయి. అదే సమయంలో ట్రాన్స్‌జెండర్లు వచ్చారు. పెళ్లి వారి నుంచి కానుకలు అడిగారు. వరుడు తరపు వారు సాధారణంగా ఇచ్చే రూ.1,121కి బదులుగా రూ.23,000 అందించారు. దీంతో ట్రాన్స్‌జెండర్లకు అనుమానం వచ్చి వధువు బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో వరుడిని పక్కకు తీసుకెళ్లి పరీక్షించగా రహస్య బయటపడింది. తాను అబ్బాయిని కాదని.. ట్రాన్స్‌జెండర్‌ అని ఒప్పుకున్నాడు. దీంతో అప్పటి దాకా సందడిగా సాగిన వేడుక ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది.

ఇక అసలు రంగు బయట పడగానే వరుడి బంధువులు అక్కడ నుంచి పరారయ్యారు. ఇద్దరు, ముగ్గురు మహిళలు తప్ప అందరూ వెళ్లిపోయారు. ఆరు నెలల క్రితమే పెళ్లి నిశ్చయించుకున్నామని.. ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదని అమ్మాయి తరపు బంధువులు వాపోయారు. ఇక ఎటువంటి గొడవులు చేయకుండా వివాహ ఖర్చులు తిరిగి చెల్లించాలని అమ్మాయి మామ డిమాండ్ చేశాడు. ఇక వచ్చిన వారికి ఫలహారాలు ఇచ్చి పంపించేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version