shivsena’s Thackeray Camp: బిల్కిస్ బానో రేపిస్టులను సత్కరించడం “హిందూ సంస్కృతా”.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
shivsena’s Thackeray Camp on bilkis bano case: బిల్కిస్ బానో అత్యాచార నిందుతులను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రిపై విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ విడుదల ద్వారా దేశ మహిళలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేతలకు, మాటలకు తేడా ఉంటుందని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. శుక్రవారం ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వ స్పందనను తెలియజేయాలని ఆదేశించింది.
Read Also: Asia Cup: పాకిస్తాన్ – ఇండియా మ్యాచ్పై జోరుగా బెట్టింగ్
Also Read
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
- Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఇదిలా ఉంటే ఈ కేసుపై శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం స్పందించింది. తన అధికార పత్రిక సామ్నాలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించింది. బిల్కిస్ బానో అత్యాచార నిందితులను విడుదల చేయడంపై మోదీ, అమిత్ షాలు మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించింది. రేపిస్టులను సత్కరించడం ‘‘హిందూ సంస్కృతా’’ అని ప్రశ్నించింది. సామ్నా పత్రికలో ‘ కడక్ నాథ్ ముంబైకర్’ బైలైన్ తో ప్రచురితమైన ఓ ఆర్టికల్ లో బీజేపీ తీరును ఎండగట్టింది. బిల్కిస్ బానో ముస్లిం అయినందు వల్ల ఆమెపై జరిగిన నేరాన్ని క్షమించలేవని.. ఇది హిందూ-ముస్లిం సమస్య కాదని.. హిందుత్వ ఆత్మ, గొప్ప సంస్కృతికి సంబంధించిందని సామ్నాలో పేర్కొంది. ప్రధాని గుజరాల్ పర్యటనలో బిల్కిస్ బానో కుటుంబాన్ని సందర్శించి ఆమెకు మద్దతు అందించాలని డిమాండ్ చేసింది.
2002లో గోద్రా రైలు దగ్ధం జరిగిన తర్వాత గుజరాత్ వ్యాప్తంగా మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబంలో మూడేళ్ల కుమార్తెతో పాటు ఏడుగురిని చంపారు. ఈ ఘటన తర్వాత సీబీఐ స్పెషల్ కోర్టు 11 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. ఇదిలా ఉంటే ఇటీవల గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ద్వారా ఈ 11 మందిని ఆగస్టు 15న జైలు నుంచి విడుదల చేసింది. వీరంతా 15 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్నారు. వీరు విడుదలైన తర్వాత స్థానిక నాయకులు స్వీట్లు, పూల దండలతో సత్కరించడం వివాదాస్పదం అయింది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
-
Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!