Adjournment Motion: బంగ్లాదేశ్లో అల్లర్లు.. ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు..!
- ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం.. హాజరై అమిత్ షా.. రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న పరిణామాలపై భారత పార్లమెంట్ లో చర్చించాలని డిమాండ్..
- ఉభయ సభల్లోనూ వాయిదా తీర్మానాలు ప్రవేశ పెట్టిన కాంగ్రెస్..
- బంగ్లాదేశ్ లో జరిగే అల్లర్ల వల్ల భారత్ పై పడే ప్రభావం గురించి చర్చించాలని తీర్మానం..
Adjournment Motion: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అయితే, బంగ్లాదేశ్లో కొనసాగుతున్న పరిణామాలపై చర్చించాలని కోరుతూ ఇవాళ ఉభయ సభల్లోనూ వాయిదా తీర్మానాలు చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా వాయిదా తీర్మానం ఇవ్వగా.. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిపై ప్రధానంగా చర్చించాలని.. ఆ దేశం వల్ల భారత్పై పడే ప్రభావం గురించి చర్చించాలని ఆయన తన వాయిదా తీర్మానంలో వెల్లడించారు. ఇక, లోక్సభలోనూ ఇదే అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి ఈ తీర్మానం ప్రవేశ పెట్టారు.
Read Also: Gold Rate Today: ‘గోల్డెన్’ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! కిలో వెండిపై రూ.3200 తగ్గింది
Also Read
కాగా, బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఈ సమావేశం స్టార్ట్ అయింది. ఈ మీటింగ్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజుతో పాటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే అఖిలపక్ష భేటీకి హాజరయ్యారు. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత్ లోనే ఉన్నారు. అయితే, లండన్లో ఆమెకు ఆశ్రయం దొరికే ఆమె ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!