MP Sanjay Raut: సంజయ్ రౌత్ సంచనల వ్యాఖ్యలు.. వారణాసిలో మోదీపై ప్రియాంక గాంధీ పోటీ చేస్తే తప్పక గెలుస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని అన్నారు. వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీని తమ ఎంపీగా కోరుకుంటున్నారని అన్నారు. ‘వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోడీకి పోటీగా బరిలో దిగితే ప్రియాంక తప్పక గెలుస్తారు. రాయ్బరేలీ, వారణాసి, అమేథీలో బీజేపీకి గట్టి పోటీ ఉంటుంద ని సంజయ్ రౌత్ చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ భేటీపై కూడా సంజయ్ రౌత్ స్పందించారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తో మన ప్రధాని మోదీ సమావేశమయినప్పుడు.. శరద్, అజిత్ ఎందుకు భేటీ కాకూడదని ప్రశ్నించారు. ‘పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకోగా లేనిది.. శరద్ పవార్, అజిత్ పవార్ ఎందుకు కలుసుకోకూడదు. ప్రతిపక్ష కూటమి ఇండియా (INDIA) సమావేశానికి హాజరుకావాలని చెప్పడానికే అజిత్ పవార్ను శరద్ పవార్ కలిసి ఉంటారని తాను భావిస్తున్నానని.. దీనిపై శరద్ పవార్ త్వరలోనే మాట్లాడతారని అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ సహా మహారాష్ట్ర ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై సంతోషంగా లేరని అన్నారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పోటీచేస్తే తప్పకుండా ఆమె విజయం సాధిస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. వారణాసి ప్రజలు ఆమెను కోరుకుంటున్నారని, ప్రధాని మోడీకి ప్రత్యర్ధిగా ఆమె పోటీ చేస్తే గెలుస్తారని రౌత్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో అమేథీ, రాయబరేలీలోనూ బీజేపీకి ఎదురీత తప్పదని జోస్యం చెప్పారు. ‘వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీ వాద్రాను కోరుకుంటున్నారు.. ఒకవేళ ఆమె మోడీపై పోటీ చేస్తే గెలుపు ఖాయం.. రాయబరేలీ, వారణాసి, అమేథీలో ఈసారి బీజేపీకి భంగపాటు తప్పదని సంజయ్ రౌత్ అన్నారు. ‘నా కుటుంబసభ్యుడు.. నా అన్న కుమారుడితో మాట్లాడితే తప్పేముంది.. ఇది ఎవరో నివాసంలో జరిగితే రహస్య అవుతుంది… నేను అతని నివాసంలోనే కలిశానని రౌత్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!