Ayodhya gangrape: గ్యాంగ్ రేప్ కేసు రాజీ కుదుర్చుకోవాలి.. బాలిక తల్లికి డబ్బులు ఆఫర్ చేసిన సమాజ్వాదీ నేతలు..
- ఉత్తర్ ప్రదేశ్లో సంచలనంగా గ్యాంగ్ రేప్..
- నిందితుల్లో సమాజ్వాదీ పార్టీ నేత..
- రాజీ కుదుర్చుకునేందుకు బాలిక తల్లికి డబ్బులు ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya gangrape: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ అంశం సంచలనంగా మారింది. అయోధ్యలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే యోగి సర్కార్ చర్యలు ప్రారంభించింది. అయోధ్య జిల్లాలోని భదర్సా నగర్లో ఖాన్ బేకరీ యజమాని, స్థానిక సమాజ్వాదీ పార్టీ నేత అయిన మోయిద్ ఖాన్, అతడి ఉద్యోగి రాజు ఖాన్ ఇద్దరు అందులో పనిచేస్తున్న 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు గర్భం రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యోగి సర్కార్ నిందితుల బేకరీని బుల్డోజర్లతో కూల్చివేసింది. ఈ కేసులో బాధితురాలిని సీఎం యోగి నేరుగా కలుసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Read Also: Ayodhya Rape Case: 12 ఏళ్ల బాలిక కడుపులో 12 వారాల పాప..నిందితుడి ఇంటికి బుల్డోజర్!
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
ఇదిలా ఉంటే, అత్యాచార విషయాన్ని దాచి ఉంచేందుకు సమాజ్వాదీ పార్టీకి చెందిన పలువురు నేతలు తమకు డబ్బు ఆశ చూపించినట్లుగా బాధితురాలి తల్లి చెప్పింది. భదర్సనగర్ పంచాయతీ చైర్మన్గా ఉన్న ఎస్పీ నేత మహ్మద్ రషీద్ తనకు డబ్బు ఆఫర్ చేసి, కేసులో రాజీ కుదుర్చుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర పోలీసు అధికారులు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. తమకు ఆర్థిక సాయం అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది.
రెండు నెలల క్రితం బాలికపై మోయిద్ ఖాన్, రాజుఖాన్ లు అత్యాచారానికి పాల్పడ్డారు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భవతి అని తేలింది. నిందితుడు మొయిద్ ఖాన్, ఇటీవల అయోధ్య రామాయలం ఉన్న ఫైజాబాద్ నుంచి గెలిచిన ఎస్పీ నేత అవధేశ్ ప్రసాద్ టీంలో భాగమని బీజేపీతో పాటు సీఎం యోగి ఆరోపించారు. అయితే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ కేసులో నిందితులకు దూరంగా ఉన్నారు. మరోవైపు నిందితులకు డీఎన్ఏ టెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేయడంపై అధికార బీజేపీతో పాటు మాయావతి బీఎస్పీ పార్టీ ఫైర్ అవుతోంది.
తాజావార్తలు
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!