Sabarimala: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త..
- శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- భక్తుల కోసం దర్శన సమయాలు పెంపు..
- దర్శన సమయాలు రీ షెడ్యూల్ చేసిన దేవస్వం బోర్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే మండలం మకరవిళక్కు సీజన్ కోసం శబరిమల ఆలయ దర్శన సమయాలను రీషెడ్యూల్ చేసింది. భక్తుల కోసం దర్శన సమయాన్ని పెంచింది. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శన సమయం ఉంటుంది. భక్తుల దర్శనానికి 17 గంటల సమయం ఇచ్చింది. ప్రధాన పూజారితో సంప్రదింపులు జరిపిన తర్వాత దర్శన సమయంపై నిర్ణయం తీసుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.
Read Also: Appudo Ippudo Eppudo: ఆసక్తికరంగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్
Also Read
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
- Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
- Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
“తాంత్రి (ప్రధాన పూజారి) ఈ విషయంలో చాలా సహకారాన్ని అందించారు. ఈసారి శబరిమలలో వర్చువల్ క్యూ వ్యవస్థ మాత్రమే అమలులో ఉంది, అయితే ప్రతి భక్తుడికి దర్శనానికి అవకాశం కల్పిస్తాం. అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటాం’’ అని ప్రశాంత్ తెలిపారు. స్పాట్ బుకింగ్స్ని తొలగించి వర్చువల్ క్యూను మాత్రమే అనుమతించాలనే నిర్ణయంపై అనేక ఆందోళనలు తలెత్తున్నాయని ఆయన అన్నారు.
గతేడాది తీర్థయాత్ర సమయంలో విపరీతమైన రద్దీని చూశామని, దీంతో పోలీసులు వారిని అడ్డుకోవాల్సి వచ్చిందని, ఆ రోజుల్లో 20,000 కంటే ఎక్కువ స్పాట్ బుకింగ్స్ ఉన్నాయని చెప్పారు. మాకు భక్తుల సంఖ్య ముఖ్యం కాదని, భక్తుల భద్రతే ముఖ్యమని చెప్పారు. ఈ ఏడాది శబరిమల దర్శనానికి కేరళ ప్రభుత్వ ఆన్లైన్ బుకింగ్స్ విధానాన్ని తీసుకువచ్చింది. దీనిపై పినరయి విజయన్ ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
తాజావార్తలు
-
NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
-
VVS Laxman: జింబాబ్వే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్పై ప్రశంసల జల్లు..
-
Zimbabwe Captain: సికందర్ రజా అరుదైన రికార్డు.. రోహిత్, బాబర్లను దాటేసిన జింబాబ్వే కెప్టెన్..
-
Mohan Bhagwat : మాతృశక్తిని మర్చిపోవడమే దేశ పతనానికి కారణం
-
PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!