2024 Elections: అధికార ఎన్డీఏ.. ప్రతిపక్ష పార్టీల వరుస భేటీలు.. 2024లో గెలుపే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 Elections: 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం కోసం అధికార, ప్రతిపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యా్ట్రిక్ సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా గెలిచి తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే అటు బీజేపీకి గానీ.. ఇటు కాంగ్రెస్ గానీ సొంతంగా కాకుండా.. కూటముల రూపంలోనే ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిగా మూడోసారి ముందుకెళుతుండగా.. గతంలో యూపీఏకి నాయకత్వం వహించిన కాంగ్రెస్ తన పాత మిత్రులను కలుపుకోవడమే కాకుండా కొత్త వారితోనూ ముందుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలతో సమావేశాలను నిర్వహించడం మొదలు పెట్టింది. ఇప్పటికే ఒక మీటింగ్ను పూర్తిచేసి ఇపుడు రెండో మీటింగ్ను ఈ రోజు బెంగళూరులో నిర్వహించనుంది. ఈ సమావేశాన్ని ఈ రోజుతోపాటు రేపు కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించడం కోసం ఎన్డీఏ ప్రయత్నాలు ప్రారంభించింది. రేపు ఎన్డీఏ పక్షాల మొదటి సమావేశంను నిర్వహించనున్నారు.
Read also: IND vs WI: వెస్టిండీస్కు అజిత్ అగర్కార్.. ఎవరి కోసం?
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
లోక్సభ ఎన్నికలు మరో పది నెలల్లో జరుగనుండగా.. పాలక, ప్రతిపక్షాలు మిత్రులను కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. పోటాపోటీగా సోమ, మంగళవారాల్లో సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఎన్డీఏ వైపు 36 పార్టీలు ఉండగా.. బెంగళూరులో జరిగే విపక్షాల సమావేశానికి 24 పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఐక్యతా యత్నాల జోరును కాంగ్రెస్ పెంచింది. ఇతర విపక్షాలకు దీటుగా కమలనాథులు కూడా మిత్రపక్షాలను చేరదీస్తున్నారు. ఎన్డీఏలో ప్రస్తుత 30 పార్టీలు కొనసాగుతున్నాయి. వాటిలో బీజేపీ, అన్నాడీఎంకే, శివసేన (షిండే), నేషనల్ పీపుల్స్పార్టీ, ఎన్డీపీపీ, సిక్కిం క్రాంతి మోర్చా, జేజేపీ, ఐఎంకేఎంకే, ఏజేఎస్యూ, ఆర్పీఐ, మిజో నేషనల్ ఫ్రంట్, బోడో పీపుల్స్ ఫ్రంట్, తమిళ మానిల కాంగ్రెస్, ఐపీఎఫ్టీ, పీఎంకే, ఎంజీపీ, అప్నాదళ్, ఏజీపీ, రాష్ట్రీయ లోక్జనశక్తి పార్టీ, నిషాద్ పార్టీ, యూపీపీఎల్, ఏఐఆర్ఎన్సీ, శిరోమణి అకాలీదళ్ సంయుక్త్ (థిండ్సా), జనసేన, ప్రహార్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష, జన్ సురైవ శక్తి, కుకీ పీపుల్స్ అలయెన్స్, యూడీపీ, హెచ్ఎస్పీడీపీ పార్టీలు కొనసాగుతున్నాయి. అవి కాకుండా.. కొత్తగా మరో 6 పార్టీలు చేరనున్నాయి. వాటిలో ఎన్సీపీ (అజిత్), ఎల్జేపీ (రాంవిలాస్), హిందూస్థాన్ ఆవామ్ మోర్చా (హెచ్ఏఎం), ఆర్ఎల్ఎ్సపీ, వికాస్సీల్ ఇన్సాన్ పార్టీ, ఎస్బీఎస్పీ.
Read also: Woman Loots 27 Men: ఒక మహిళ.. 27 మంది భర్తలు.. కథలో పెద్ద ట్విస్ట్
గత నెల జూన్ 23న పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికి మొత్తం 15 పార్టీలు హాజరయ్యాయి. వాటిలో కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సీపీఎం, సీపీఐ, జేడీయూ, ఆర్జేడీ, డీఎంకే, సమాజ్వాదీ, శివసేన (ఉద్ధవ్), జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ (ఎంఎల్) పార్టీలు ఉన్నాయి. ఇవి కాకుండా కొత్తగా మరో 9 పార్టీలు చేరబోతున్నాయి. కొత్తగా చేరబోయే పార్టీలు వీసీకే, ఫార్వర్డ్ బ్లాక్, ఎండీఎంకే, కేడీఎంకే, ఆర్ఎ్సపీ, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి), ఆర్ఎల్డీ ఉన్నాయి.
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!