Delhi: ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు.. బీజేపీ కొత్త చీఫ్పై చర్చ జరిగే ఛాన్స్
- ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు
- బీజేపీ కొత్త చీఫ్పై చర్చ జరిగే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరగనున్నాయి. కేశవ్ కుంజ్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ నేతృత్వంలో మంతన్ బైటక్ జరగనుంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ శతాబ్దోత్సవాల ప్రణాళికలపై కీలకంగా చర్చించనున్నారు. అలాగే సామాజిక సమరసతపై ‘పంచ్ పరివర్తన్’ దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలపై కూడా మార్గదర్శకాలు చేయనున్నారు. ఇక ముంబై, బెంగుళూరు, కోల్కతా తదితర నగరాల్లో ప్రత్యేక సమావేశాలకు సన్నాహాలు చేస్తున్నారు. వీటిన్నంటితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై కూడా ఆర్ఎస్ఎస్ సమావేశంలో చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Prabhas : ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సాయం.. ఫేక్ వార్తలపై క్లారిటీ ఇదే
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవి కాలం ముగిసింది. కొత్త అధ్యక్ష పదవి ఈసారి మహిళకు ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ సూచించింది. ఈ దిశగా బీజేపీ హైకమాండ్ కూడా అడుగులు వేస్తోంది. అయితే ఈ రేసులో ప్రధానంగా నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈమెకు దేశ వ్యాప్తంగా మంచి పలుకుబడి ఉంది. అంతేకాకుండా నాయకులందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే భాషలపై మంచి పట్టు ఉంది. ఇక రక్షణ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి సేవలందించారు. అంతేకాకుండా త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ప్రాంత వాసిగా ఈ అంశం పార్టీకి కలిసి వస్తుందని భావిస్తోంది. అంతేకాకుండా దక్షిణాదిలో కూడా పార్టీ బలపడాలంటే.. సౌతిండియా మహిళకే ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తోంది. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మోడీ సర్కార్.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్ష పదవి మహిళలకే ఇస్తేనే బాగుంటుందని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మేథోమథనం చేస్తున్నాయి. ఒక నిర్మలా సీతారామన్ కాకపోతే మాత్రం రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి అవకాశం దక్కే ఛాన్సుంది.
ఇది కూడా చదవండి: Bride Leaves with Boyfriend: ఉదయం పెళ్లి.. మధ్యాహ్నం ప్రియుడితో పెళ్లి కూతురు జంప్..! బతికిపోయాడా..?
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!