Lottery Ticket: అన్నదాతకు జాక్పాట్.. రూ.7 లాటరీ టికెట్తో రూ.కోటి గెలుపు
- అన్నదాతకు జాక్పాట్
- రూ.7 లాటరీ టికెట్తో రూ.కోటి గెలుపు
- సంతోషంతో ఎగిరి గంతులేసిన రైతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది సుడి తిరగాలంటే లాటరీ అన్నా గెలవాలి.. లేదంటే అదృష్టమైనా కలిసి రావాలని అప్పుడప్పుడు అంటుంటారు. ఇలాంటి మాటలు సరదానే మాట్లాడుకున్నా.. ఇది అక్షరాల రుజువైంది. ఓ అన్నదాతను అదృష్టం తలుపు తట్టింది. రూపాయి కాదు.. లక్ష కాదు.. ఏకంగా ఒకేసారి కోటి రూపాయుల బహుమతి గెలుచుకున్నాడు. అతని ఆనందానికి అవధులే లేవు. ఇది ఎక్కడ జరిగింది. ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్ నివాసి అయిన బల్కార్ సింగ్.. సిర్హింద్లోని బిట్టు లాటరీ స్టాల్ నుంచి రూ.7 లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. 10 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నాడు. కానీ ఏ రోజూ కూడా లాటరీ గెలవలేదు. ఇప్పటికే వందలాది లాటరీ టికెట్లు కొన్నా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా కొనుగోలు చేసిన టికెట్ను కూడా అలానే భావించాడు. కానీ డిసెంబర్ 29న రూ.కోటి లాటరీ గెలిచినట్లుగా బల్కార్ సింగ్కు నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అతడు ఎగిరి గంతులేశాడు. మొత్తానికి 2025 సంవత్సరం చివరిలో అదృష్టం కలిసొచ్చింది.
లాటరీ గెలిచిన వార్త తెలియగానే బల్కార్ సింగ్.. మజ్రి సోధియాన్ గ్రామంలో నృత్యం చేస్తూ గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశాడు. దీంతో స్థానికులు పూల దండలతో సత్కరించారు. దేవుని ఆశీర్వాదంతో లాటరీ గెలుచుకున్నట్లుగా అన్నదాత తెలిపాడు. 90 శాతం డబ్బును వ్యవసాయ పనులకు ఉపయోగిస్తానని.. మిగతా 10 శాతం సహాయం చేయడానికి ఖర్చు చేస్తానని వెల్లడించాడు.
ఇది కూడా చదవండి:Modi-Putin: తీవ్ర ఆవేదన చెందా.. పుతిన్ నివాసంపై దాడిని ఖండించిన మోడీ
ఇక లాటరీ స్టాల్ యజమాని ముఖేష్ కుమార్ బిట్టు మాట్లాడుతూ.. తాను 45 సంవత్సరాలుగా లాటరీ వ్యాపారం నిర్వహిస్తున్నానని.. తన స్టాల్ గతంలో రూ. 10 లక్షల వరకు బహుమతులు గెలుచుకున్నప్పటికీ ఇప్పటి వరకు కోటి రూపాయులు గెలుచుకోలేదన్నారు. రూ. 1 కోటి బహుమతిని గెలుచుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపాడు. డిసెంబర్ 24న లాటరీ డ్రా తీశామని.. అదే రోజు ఫలితాలు ప్రకటించినట్లు చెప్పాడు. అయితే ఫతేఘర్ సాహిబ్లో షహీదీ సమాగం జరుగుతున్నందున వరుసగా మూడు రోజులు లంగర్ సేవలో బిజీగా ఉన్నట్లు తెలిపాడు. ఆ సమయంలో వ్యాపారం మూసేశామని.. వెంటనే రైతుకు సమాచారం అందించలేదన్నారు. కొన్ని రోజుల తర్వాతే బల్కార్ సింగ్కు సమాచారం అందించినట్లు తెలిపాడు.
ఇది కూడా చదవండి: Trump: భారత్-పాక్ యుద్ధం ఆపితే గుర్తించలేదు.. నెతన్యాహుతో ట్రంప్ ఆవేదన
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!