Lottery Ticket: అన్నదాతకు జాక్పాట్.. రూ.7 లాటరీ టికెట్తో రూ.కోటి గెలుపు
- అన్నదాతకు జాక్పాట్
- రూ.7 లాటరీ టికెట్తో రూ.కోటి గెలుపు
- సంతోషంతో ఎగిరి గంతులేసిన రైతు
చాలా మంది సుడి తిరగాలంటే లాటరీ అన్నా గెలవాలి.. లేదంటే అదృష్టమైనా కలిసి రావాలని అప్పుడప్పుడు అంటుంటారు. ఇలాంటి మాటలు సరదానే మాట్లాడుకున్నా.. ఇది అక్షరాల రుజువైంది. ఓ అన్నదాతను అదృష్టం తలుపు తట్టింది. రూపాయి కాదు.. లక్ష కాదు.. ఏకంగా ఒకేసారి కోటి రూపాయుల బహుమతి గెలుచుకున్నాడు. అతని ఆనందానికి అవధులే లేవు. ఇది ఎక్కడ జరిగింది. ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్ నివాసి అయిన బల్కార్ సింగ్.. సిర్హింద్లోని బిట్టు లాటరీ స్టాల్ నుంచి రూ.7 లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. 10 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నాడు. కానీ ఏ రోజూ కూడా లాటరీ గెలవలేదు. ఇప్పటికే వందలాది లాటరీ టికెట్లు కొన్నా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా కొనుగోలు చేసిన టికెట్ను కూడా అలానే భావించాడు. కానీ డిసెంబర్ 29న రూ.కోటి లాటరీ గెలిచినట్లుగా బల్కార్ సింగ్కు నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అతడు ఎగిరి గంతులేశాడు. మొత్తానికి 2025 సంవత్సరం చివరిలో అదృష్టం కలిసొచ్చింది.
లాటరీ గెలిచిన వార్త తెలియగానే బల్కార్ సింగ్.. మజ్రి సోధియాన్ గ్రామంలో నృత్యం చేస్తూ గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశాడు. దీంతో స్థానికులు పూల దండలతో సత్కరించారు. దేవుని ఆశీర్వాదంతో లాటరీ గెలుచుకున్నట్లుగా అన్నదాత తెలిపాడు. 90 శాతం డబ్బును వ్యవసాయ పనులకు ఉపయోగిస్తానని.. మిగతా 10 శాతం సహాయం చేయడానికి ఖర్చు చేస్తానని వెల్లడించాడు.
ఇది కూడా చదవండి:Modi-Putin: తీవ్ర ఆవేదన చెందా.. పుతిన్ నివాసంపై దాడిని ఖండించిన మోడీ
ఇక లాటరీ స్టాల్ యజమాని ముఖేష్ కుమార్ బిట్టు మాట్లాడుతూ.. తాను 45 సంవత్సరాలుగా లాటరీ వ్యాపారం నిర్వహిస్తున్నానని.. తన స్టాల్ గతంలో రూ. 10 లక్షల వరకు బహుమతులు గెలుచుకున్నప్పటికీ ఇప్పటి వరకు కోటి రూపాయులు గెలుచుకోలేదన్నారు. రూ. 1 కోటి బహుమతిని గెలుచుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపాడు. డిసెంబర్ 24న లాటరీ డ్రా తీశామని.. అదే రోజు ఫలితాలు ప్రకటించినట్లు చెప్పాడు. అయితే ఫతేఘర్ సాహిబ్లో షహీదీ సమాగం జరుగుతున్నందున వరుసగా మూడు రోజులు లంగర్ సేవలో బిజీగా ఉన్నట్లు తెలిపాడు. ఆ సమయంలో వ్యాపారం మూసేశామని.. వెంటనే రైతుకు సమాచారం అందించలేదన్నారు. కొన్ని రోజుల తర్వాతే బల్కార్ సింగ్కు సమాచారం అందించినట్లు తెలిపాడు.
ఇది కూడా చదవండి: Trump: భారత్-పాక్ యుద్ధం ఆపితే గుర్తించలేదు.. నెతన్యాహుతో ట్రంప్ ఆవేదన
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!