RG Kar Case Verdict: కోల్కతా వైద్యురాలి కేసులో సంచలనం.. దోషిగా సంజయ్ రాయ్..
- కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసులో సంచలనం..
- నిందితుడు సంజయ్ రాయ్ని దోషిగా తేల్చిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RG Kar Medical Hospital: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం- హత్యపై కోల్కతాలోని సీల్దాలోని సెషన్స్ కోర్టు ఈరోజు (జనవరి 18) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ని దోషిగా తేల్చింది. 160 పేజీల తీర్పులో, కోర్టు అత్యాచారం, హత్య, మరణానికి కారణమయ్యే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద రాయ్ను దోషిగా నిర్ధారించింది. ఈ కేసు విచారణలో మొదట సంజయ్ రాయ్ తాను నేరం చేశానని ఒప్పుకున్నప్పటికీ, తర్వాత తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. అయితే, సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత సంజయ్ రాయ్ నేరం చేసినట్లు కోర్టులో తేలింది. సోమవారం ఈ కేసులో కోర్టు శిక్షల పరిమాణాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
కోల్కతాలోని ఆర్జీ కర్ హాస్పిటర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలి ఘటన యావద్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీంతో వందలాది మంది ప్రజల నిరసనలు చేశారు. కోల్కతా పోలీస్లో పౌర వాలంటీర్గా పని చేస్తున్న సంజయ్ రాయ్.. గత ఏడాది ఆగస్టు 9వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి సెమినార్ హాల్లో వైద్యురాలిపై నేరానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: Breaking News: హైదరాబాద్ నగరంలో మరోమారు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సాక్ష్యాలు నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలతో, కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఆగస్టు 13న 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసుకుంది. 66 రోజుల పాటు జరిగిన విచారణలో సంజయ్ రాయ్ నేరానికి పాల్పడినట్లు తగిని డీఎన్ఏ నమూనాలు, నేర ప్రాంతంలో దొరికిన వెంట్రుకలతో కూడిన నివేదికను సమర్పించింది. ట్రైనీ డాక్టర్ ను అత్యాచారం చేసే సమయంలో నిందితుడి శరీరంపై ఐదు గాయాలు కనిపించాయని సీబీఐ తరపు లాయర్ వెల్లడించారు. అంతేకాకుండా, అతడు సెమినార్ హల్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కనిపించకుండా పోయిన అతని బ్లూటూత్, నేరం జరిగిన ప్రదేశంలో దొరికిందని సీబీఐ సీల్దా కోర్టులో చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!