RG Kar Case Verdict: కోల్కతా వైద్యురాలి కేసులో సంచలనం.. దోషిగా సంజయ్ రాయ్..
- కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసులో సంచలనం..
- నిందితుడు సంజయ్ రాయ్ని దోషిగా తేల్చిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RG Kar Medical Hospital: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం- హత్యపై కోల్కతాలోని సీల్దాలోని సెషన్స్ కోర్టు ఈరోజు (జనవరి 18) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ని దోషిగా తేల్చింది. 160 పేజీల తీర్పులో, కోర్టు అత్యాచారం, హత్య, మరణానికి కారణమయ్యే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద రాయ్ను దోషిగా నిర్ధారించింది. ఈ కేసు విచారణలో మొదట సంజయ్ రాయ్ తాను నేరం చేశానని ఒప్పుకున్నప్పటికీ, తర్వాత తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. అయితే, సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత సంజయ్ రాయ్ నేరం చేసినట్లు కోర్టులో తేలింది. సోమవారం ఈ కేసులో కోర్టు శిక్షల పరిమాణాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
కోల్కతాలోని ఆర్జీ కర్ హాస్పిటర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలి ఘటన యావద్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీంతో వందలాది మంది ప్రజల నిరసనలు చేశారు. కోల్కతా పోలీస్లో పౌర వాలంటీర్గా పని చేస్తున్న సంజయ్ రాయ్.. గత ఏడాది ఆగస్టు 9వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి సెమినార్ హాల్లో వైద్యురాలిపై నేరానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారు.
Also Read
- Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
Read Also: Breaking News: హైదరాబాద్ నగరంలో మరోమారు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సాక్ష్యాలు నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలతో, కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఆగస్టు 13న 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసుకుంది. 66 రోజుల పాటు జరిగిన విచారణలో సంజయ్ రాయ్ నేరానికి పాల్పడినట్లు తగిని డీఎన్ఏ నమూనాలు, నేర ప్రాంతంలో దొరికిన వెంట్రుకలతో కూడిన నివేదికను సమర్పించింది. ట్రైనీ డాక్టర్ ను అత్యాచారం చేసే సమయంలో నిందితుడి శరీరంపై ఐదు గాయాలు కనిపించాయని సీబీఐ తరపు లాయర్ వెల్లడించారు. అంతేకాకుండా, అతడు సెమినార్ హల్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కనిపించకుండా పోయిన అతని బ్లూటూత్, నేరం జరిగిన ప్రదేశంలో దొరికిందని సీబీఐ సీల్దా కోర్టులో చెప్పారు.
తాజావార్తలు
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
ట్రెండింగ్
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!