RG Kar Case: ఆర్జీ కర్ ఆగ్రహం.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యేకు చెప్పుల దండ, గుడ్లతో దాడి
- ఆర్జీ కర్ కేసులో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ అరెస్ట్.
- మృత వైద్యురాలి మృతదేహాన్ని హడావుడిగా దహనం చేశారన్న ఆరోపణలు.
- పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలిస్తుండగా మాజీ ఎమ్మెల్యేపై ప్రజాగ్రహం.
- గుడ్లు, చెప్పులు, బూట్లు, బురదతో ఆందోళనకారుల దాడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RG Kar Case: పశ్చిమ బెంగాల్తో పాటు దేశ వ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్-హాస్పిటల్లో మహిళా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో కీలక పరిణామం ఎదురైంది. బాధిత వైద్యురాలి మృతదేహాన్ని హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించిన ఆరోపణలపై మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లా ఖర్దా పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు అతడిని కోర్టుకు తీసుకెళ్తుండగా ప్రజలు ఆగ్రహంతో దాడి చేశారు.
ఆగ్రహంలో ఉన్న ప్రజలు ఆయనపై పిడిగుద్దులతో, కాళ్లతో దాడి చేసింది. పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది నిర్మల్ ఘోష్ రక్షణ కోసం హెల్మెట్లు వాడినప్పటికీ, ప్రజలు ఆయనను లక్ష్యంగా చేసుకుంది. ఆగ్రహంతో ఉన్న గుంపు మాజీ ఎమ్మెల్యేపై బూట్లు, చెప్పులు, గుడ్లు, చివరికి బురద కూడా విసిరారు. వారు ఆయనకు బూట్ల దండ కూడా వేశారు. నిర్మల్ ఘోష్తో సహా అయన సన్నిహితుడు పానిహటి మాజీ కౌన్సిలర్ సంజీబ్ ముఖర్జీ కూడా ఇదే ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. ముఖర్జీని, ఘోష్ కన్నా ఒక రోజు ముందు అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం తర్వాత డాక్టర్ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలిస్తున్నప్పుడు ముఖర్జీ అక్కడే ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- IMD Alert: ఎర్రకోట వేడుకలకు వరుణుడు అడ్డంకి.. ఐఎండీ హెచ్చరిక
- Ajit Doval: "మా సహనాన్ని బలహీనతగా భావించొద్దు".. అజిత్ దోవల్ మాస్ వార్నింగ్..
- Attacks on Indians abroad: అమెరికా, యూకే, కెనడాల్లో భారతీయులపై పెరిగిన దాడులు..
- August 15 Independence Day: భారత్తో పాటు, ఆగస్టు 15న ఈ నాలుగు దేశాలకు స్వాతంత్య్రం..
మరణించిన వైద్యురాలి తండ్రి సోమవారం దాఖలు చేసిన కొత్త ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. కుటుంబ సభ్యుల కోరికకు వ్యతిరేకంగా అప్పటి ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ తన కుమార్తె అంత్యక్రియల్ని హడావిడిగా చేయించారని తండ్రి ఆరోపించారు. ఈ కేసుపై కొత్తగా దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి సువేందు అధికారి బ్యారక్పూర్ పోలీస్ కమిషనర్కు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. దీని తర్వాత వీరిద్దరి అరెస్టులు జరిగాయి.
ఈ కేసులో ఏదో కుట్ర ఉందని బాధితురాలి కుటుంబం ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. పోలీసులు, రాజకీయ నాయకులు కుమ్మకై రాత్రికి రాత్రే మృతదేహాన్ని దహనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా చేసుండకపోతే మృతదేహానికి రెండో పోస్టుమార్టం జరిగి కీలక విషయాలు వెలుగులోకి వచ్చేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ కేసులో అప్పటి సీఎం మమతా బెనర్జీ పాత్రపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
RG Kar Case: ఆర్జీ కర్ ఆగ్రహం.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యేకు చెప్పుల దండ, గుడ్లతో దాడి
-
IMD Alert: ఎర్రకోట వేడుకలకు వరుణుడు అడ్డంకి.. ఐఎండీ హెచ్చరిక
-
Ajit Doval: “మా సహనాన్ని బలహీనతగా భావించొద్దు”.. అజిత్ దోవల్ మాస్ వార్నింగ్..
-
Indian Bowler: బుమ్రా లేని లోటు.. సిరాజ్తో కలిసి కొత్త బంతిని పంచుకునే ఆ ‘సీక్రెట్’ పేసర్ ఎవరు..?
-
Wamiqa Gabbi: ఇంతకాలం ఎక్కడున్నావమ్మా.. ఒక్క సినిమాతో వామిక గబ్బికి ఫుల్ డిమాండ్!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!