Manipur: సర్జికల్ స్ట్రైక్ హీరోకి మణిపూర్ బాధ్యతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: జాతులు మధ్య ఘర్షణతో మణిపూర్ అట్టుడుకుతోంది. మైయిటీ, కూకీ జాతుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో మయన్మార్ లో సర్జికల్ స్ట్రైక్ చేసిన పారాకమాండోకు కీలక బాధ్యతను అప్పచెప్పింది. ప్రస్తుతం ఆయన రిటైల్ అయినా మణిపూర్లో పరిస్థితి శాంతిని నెలకొల్పేందుకు ఈ రిటైర్ ఆర్మీ అధికారి సాయం తీసుకుంటున్నారు.
రిటైర్డ్ కల్నల్ నెక్టార్ సంజెన్బామ్ ని ఇటీవల మణిపూర్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు కాంబాట్ విభాగానికి సీనియర్ సూపరింటెండెంట్ గా నియమించింది. ఈ పదవిలో ఆయన 5 ఏళ్లు కొనసాగనున్నారు. మూడు నెలల క్రితం మణిపూర్ రాష్ట్ర మంత్రివర్గం ఆయన నియామకంపై నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను కట్టడి చేసేందుకు ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
గతంలో నెక్టార్ సంజెన్బాయ్ సైన్యంలోని 21 పారా స్పెషల్ ఫోర్స్ లో పనిచేశారు. సైన్యం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన కీర్తిచక్ర, శౌర్యశక్ర అవార్డులను అందుకున్నారు.
Read Also: Early Elections: లోక్సభ ముందస్తు ఎన్నికలు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
2015 సర్జికల్ స్ట్రైక్లో కీలకం:
2015 మయన్మార్ లో భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ లో నెక్టార్ కీలక పాత్ర పోషించారు. 2015 జూన్ లో డోగ్రా బెటాలియన్ పై మణిపూర్ చండేల్ జిల్లాలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 18 మంది సైనికులు మరణించారు. ఈ ఘటనను మోదీ ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సరిహద్దు దేశం మయన్మార్ లో ఉన్నారనే సమాచారంతో, సైన్యంతో అత్యున్నతమైన పారా కమాండోలను రంగంలోకి దించింది. జూన్ 8-9 రాత్రి సమయంలో పారా ఎస్ఎఫ్ టీం మయన్మార్ అడవుల్లోకి ప్రవేశించి అక్కడ దాగి ఉన్న 20 మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టి ప్రతీకారం తీర్చుకుంది. ఈ సాహసోపేత ఆపరేషన్ తర్వాత టీంలోని 8 మమది సభ్యులకు ఆగస్టు 15న మకేంద్రం గ్యాలెంట్రీ అవార్డులను అందించింది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!