Draupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. తొలి గిరిజన మహిళగా రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Draupadi Murmu As 15th President: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలిచారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ముర్ము ఘన విజయం సాధించారు. ప్రపంచంలోొ అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశానికి తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డ్ సృష్టించారు. మూడు రౌండ్లు జరిగే సరికే ద్రౌపది ముర్ము సగానికి పైగా ఓట్లు సాధించారు. ఇంకో రెండు రౌండ్లు మిగిలి ఉండగానే రాష్ట్రపతిగా గెలుపొందారు. మూడు రౌండ్లు ముగిసే సరికి ద్రౌపది ముర్ము 5,77,777 ఓట్లను సాధించగా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా 2,61,062 విలువైన ఓట్లను సాధించారు. ఈ నెల 25 ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చాలా రాష్ట్రాల్లో ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. మొత్తంగా రాష్ట్రపతి ఎన్నికల్లో 10.80 లక్షల ఓట్లలో సగానికి పైగా ఓట్లు ముర్ముకు పడ్డాయి. ఎన్డీయే అభ్యర్థి ముర్ముకు 44 పార్టీలు మద్దతు ఇస్తే, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 34 పార్టీలు మద్దతు ఇచ్చాయి. తాజాగా ఎన్నికల్లో 68.87 శాతం ఓట్లు రాగా..31.1 శాతం ఓట్లు సాధించారు.
మొత్తంగా ఎన్నిక ముగిసే సమయానికి 4754 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 4701 ఓట్లు చెల్లుబాలు అవ్వగా..53 చెల్లిన ఓట్లుగా తేలాయి. ఇందులో ద్రౌపది ముర్ము 2824 మొదటి ప్రాధాన్యత ఓట్లు పొందారు. వీటి మొత్తం విలువ 6,76,803గా ఉంది. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,877 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 3,80,177 గా ఉంది. మొదటి ప్రాథాన్యత ఓట్లలోనే మెజారిటీ రావడంతో ద్రౌపది ముర్మను 15వ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి హోదాలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ప్రకటించారు. గతంలో విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇచ్చిన శివసేన వంటి పార్టీల ప్రజాప్రతినిధులు కూడా ద్రౌపది ముర్ముకు ఓటేశారు. ఎన్డీయే కూటమి పార్టీలతో పాటు బీఎస్పీ, వైసీపీ, బీజేడీ, అకాళీ దళ్ వంటి పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దతుగా నిలిచాయి. వరసగా మూడు రౌండ్లలో ద్రౌపతి ముర్ము భారీ ఆధిక్యాన్ని కనబరిచారు. రాష్ట్రపతిగా గెలుపొందిన ద్రౌపది ముర్ముకు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ తో పాటు ప్రధాని మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లారు.
Also Read
- CJP: కేంద్రానికి సీజేపీ తాజా అల్టిమేటం.. సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి..
- Parliament: కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి కీలక నిర్ణయం.. పార్లమెంట్లో సంచలన ప్రకటన
- Priyanka Gandhi: ‘‘ అత్యాచార నిందితులకు మద్దతు’’.. ప్రహ్లాద్ జోషిపై ప్రియాంకాగాంధీ సంచలన వ్యాఖ్యలు..
- Rahul Gandhi: ‘అత్యంత నీచమైన వ్యక్తి’.. కొత్త విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఫైర్
#WATCH | Prime Minister Narendra Modi greets and congratulates #DroupadiMurmu on being elected as the new President of the country. BJP national president JP Nadda is also present.
Visuals from her residence in Delhi. pic.twitter.com/c4ENPKOWys
— ANI (@ANI) July 21, 2022
తాజావార్తలు
-
Coaching Staff: భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్లో మార్పులు.. ఆ ఇద్దరికి బీసీసీఐ స్వస్తి..
-
Peddi Sudarshan Reddy : పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల
-
Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
-
CJP: కేంద్రానికి సీజేపీ తాజా అల్టిమేటం.. సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి..
-
Pavala Shyamala: శ్యామల ఎలా ‘పావలా శ్యామల’ అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!