NTV Telugu Site icon

Reel Turns Tragic: రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. ఉరి బిగుసుకుని 11 ఏళ్ల బాలుడి మృతి

Mp

Mp

Reel Turns Tragic: రీల్స్ పిచ్చి యువత ప్రాణాలు తీస్తోంది. ఈ జాడ్యం పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ప్రమాదకరమైన స్టంట్లు ద్వారా వ్యూస్ ఎక్కువగా రాబట్టేందుకు చేసే పిచ్చి ప్రయత్నాలు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా 11 ఏళ్ల పిల్లవాడు రీల్స్ చేస్తూ మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలుడు తన మెడకు తాడు బిగించుని రీల్ చేసే ప్రయత్నంలో అది గట్టిగా బిగుసుకుపోయి మరణించారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని అంబాహ్ పట్టణంలో చోటు చేసుకుంది.

Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్‌ని జైలులో చంపేందుకు కుట్ర.. సంజయ్ సింగ్ ఆరోపణలు..

కరణ్ పర్మార్ అనే 7వ తరగతి విద్యార్థి తన ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో రీల్ చేసే ఉద్దేశంతో ఒక చెట్టుకు తాడు కట్టుకుని ఉరేసుకున్నట్లుగా నటిస్తున్నాడు. ఇలా చేస్తున్న క్రమంలో పిల్లాడి చెప్పులు స్లిప్ కావడంతో తాడు బాలుడి మెడకు బిగుసుకుపోయింది. అతను నొప్పితో విలవిలలాడుతూ స్నేహితుల ముందే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతని స్నేహితులు పర్మార్ యాక్టింగ్ చేస్తున్నాడని అనుకుని వీడియో తీస్తూనే ఉన్నారు. చాలాసేపటి తర్వాత పర్మార్ నుంచి చలనం లేకుండా పోయింది. బాలుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.