RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Gold Reserves: ప్రపంచవ్యాప్తంగా నెలకున్న యుద్ధ వాతావరణం, వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో దశాబ్దాలుగా దాచిన తన బంగారు నిల్వలను ఆర్బీఐ వేగంగా స్వదేశానికి తరలిస్తోంది. “బంగారం మీ దగ్గర లేకపోతే, అది మీది కాదు” అనే కొత్త ఆర్థిక సూత్రాన్ని పాటిస్తూ భారత్ ఈ అడుగులు వేస్తోంది.
ఆరు నెలల్లోనే 104 టన్నుల బంగారం తరలింపు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం (అక్టోబర్ 2025 – మార్చి 2026).. గడిచిన ఆరు నెలల్లోనే రికార్డు స్థాయిలో 104.23 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి భారత్కు తీసుకువచ్చారు. ప్రస్తుతం భారతదేశం వద్ద ఉన్న మొత్తం 880.52 టన్నుల బంగారు నిల్వల్లో దాదాపు 77 శాతం (సుమారు 680 టన్నులు) ఇప్పుడు దేశీయ ఖజానాల్లోనే భద్రంగా ఉన్నాయి. కేవలం రెండేళ్ల క్రితం (మార్చి 2023) ఇది కేవలం 37 శాతంగా మాత్రమే ఉండేది.
Also Read
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
ఎందుకీ “బంగారం వేట” అంటే..
విదేశాల్లోని బ్యాంకుల్లో బంగారం నిల్వ చేయడం సురక్షితం కాదనే అనుమానాలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాకు చెందిన ఆస్తులను పాశ్చాత్య దేశాలు స్తంభింపజేయడం ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేసింది. రేపు ఏదైనా రాజకీయ కారణాల వల్ల మన ఆస్తులు కూడా విదేశాల్లో నిరుపయోగంగా మారకూడదని భారత్ భావిస్తోంది. ఇరాన్ – మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉంది. ఇలాంటి సమయంలో బంగారం సొంత నియంత్రణలో ఉండటమే అసలైన ‘భద్రతా భీమా’ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వ్యాపార లావాదేవీలు సులభంగా ఉంటాయని లండన్, న్యూయార్క్ మార్కెట్లలో బంగారాన్ని నిల్వ చేసేవారు. కానీ ఇప్పుడు భద్రత అంటే విదేశాల్లో దాచడం కాదు, మన కళ్ల ముందే భద్రపరుచుకోవడమని ఆర్బీఐ నిరూపిస్తోంది. ప్రస్తుతం 197.67 టన్నుల బంగారం మాత్రమే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద ఉంది. భారత విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా కూడా 13.9% నుంచి 16.7%కి పెరగడం గమనార్హం. ఇది భారతదేశం బంగారంపై చూపిస్తున్న నమ్మకాన్ని, ఆర్థిక స్వయం సమృద్ధి దిశగా వేస్తున్న అడుగులను స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
-
DRAGON : ఎన్టీఆర్ – నీల్ టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత
-
Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..