RBI Interest Rates: కీలక వడ్డీరేట్లు యథాతథం.. 10వ సారి మార్పులు చేయని ఆర్బీఐ
- ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ప్రకటించిన గవర్నర్ శక్తికాంత్ దాస్..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు యథాతథం..
- రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Interest Rates: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సోమవారం నుంచి 3 రోజుల పాటు కొనసాగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు (బుధవారం) ప్రకటించారు. రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తుంది. ఎలాంటి మార్పులు చేయకపోవడం ఆర్బీఐకి ఇది 10వ సారి.
Read Also: World Post Day 2024: నేడే ప్రపంచ తపాలా దినోత్సవం.. తపాలా చరిత్ర, ప్రాముఖ్యత
Also Read
అయితే, ప్రస్తుత పరిణామాల ప్రకారం రెపో రేటు తగ్గింపు డిసెంబర్ లో జరిగే సమావేశంలో ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం ద్రవ్య విధాన కమిటీలోని ఆరుగురు సభ్యులలో ఐదుగురు రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించాలని ఓటు వేసినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ వెల్లడించిన రేట్లు గుడ్ రిటర్న్ నిర్వహించిన పోల్ కి అనుకూలంగా ఉన్నాయి. అటు ద్రవ్యోల్బణంతో పాటు ఇటు వృద్ధి రేటును బ్యాలెన్స్ చేసే క్రమంలో ఈసారి కూడా రిజర్వు బ్యాంక్ తన ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణంలో నియంత్రణ నెమ్మదిగా, అసమానంగా ఉంటుందని శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు.
Read Also: Papaya: విషమే తింటున్నాం!. వాటిని తింటే క్యాన్సర్ రావడం ఖాయం.. చెక్ పెట్టండిలా..
అలాగే, ప్రభుత్వ వినియోగం మెరుగుపడుతోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. మెుదటి త్రైమాసికంలో 8 ప్రధాన పరిశ్రమల ఉత్పత్తి 1.8 శాతం తగ్గిందని.. FY25 మెుదటి త్రైమాసికంలో 7.2 శాతం, రెండవ త్రైమాసికంలో 7 శాతం, మూడవ త్రైమాసికంలో 7.4 శాతం, నాల్గవ త్రైమాసికంలో 7.4 శాతం వద్ద ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఇదే క్రమంలో FY 26 మెుదటి త్రైమాసికంలో వృద్ధిని 7.3 శాతం ఉండొచ్చని పేర్కొన్నారు. అలాగే, ద్రవ్యోల్బణంపై కూడా ఆర్బీఐ గవర్నర్ స్పందిస్తూ.. అంతర్జాతీయంగా, దేశీయ పరిణామాలను పరిగణలోకి తీసుకుని మూడవ త్రైమాసికంలో ఇది స్వల్పంగా పెరిగి 4.8 శాతంగా ఉండవచ్చన్నారు. ఇక, నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తగ్గి 4.2 శాతానికి చేరుకుంటుందని శక్తికాంత్ దాస్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!