Usha Thakur: రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలి.. మహిళా మంత్రి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapists should be hanged publicly to reduce crime, comments Minister Usha Thakur: మధ్యప్రదేశ్ మహిళా మంత్రి అత్యాచార నిందితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఖాండ్వాలో నాలుగేళ్ల చిన్నారి అత్యాచార ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మంత్రి ఉషా ఠాకూర్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను బహిరంగంగా ఉరితీయాని.. అప్పుడే నేరాలు తగ్గుతాయని ఆమె అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను అభ్యర్థిస్తానని అన్నారు. రేపిస్టులను బహిరంగా ఉరితీసినప్పుడే.. మరొకరు ఈ నేరాలకు పాల్పడకుండా భయం పుడుతుందని అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా ఉన్నారు ఉషా ఠాకూర్.
Read Also: Tiger attacks: బాబోయ్ పులులు.. ఎడాపెడా దాడులు
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తోందని.. కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేశంలో రేపిస్టులకు మరణశిక్ష విధించే నిబంధనలను రూపొందించిన మొదటిరాష్ట్రం మధ్యప్రదేశే ఉషా ఠాకూర్ వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 72 మంది నేరస్తులకు ఉరిశిక్ష విధించారని తెలిపారు. ఇలాంటి నేరాలు సమాజంలో మళ్లీ మళ్లీ చోటు చేసుకోవడం ఫోర్త్ ఎస్టేట్, మీడియా, మనందరికి ఆందోళన కలిగించే విషమని అన్నారు.
ఇలాంటి నేరాలు జరకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలని.. ఎవరైనా ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడితే అటువంటి నేరస్తులను బహిరంగ కూడళ్ల వద్ద శిక్ష విధించాలని ముఖ్యమంత్రిని కోరుతా అని అన్నారు. జైలులో ఇలాంటి శిక్షలు విధిస్తే..ఎవరికి తెలుస్తుందని ప్రశ్నించారు. ఇటీవల ఖాండ్వాలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి నిందితుడు చెరుకుతోటలో బాలికను వదిలివెళ్లారు. అపస్మారస్థితిలో ఉన్న చిన్నారికి ప్రస్తుతం ఇండోర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు వేరే జిల్లాలో అత్యాచారం కేసులో పట్టుబడ్డాడు. మంత్రి ఉషా ఠాకూర్ ఇద్దరి నిందితుల గురించి మాట్లాడుతూ.. బహిరంగ ఉరిని ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!