Usha Thakur: రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలి.. మహిళా మంత్రి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapists should be hanged publicly to reduce crime, comments Minister Usha Thakur: మధ్యప్రదేశ్ మహిళా మంత్రి అత్యాచార నిందితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఖాండ్వాలో నాలుగేళ్ల చిన్నారి అత్యాచార ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మంత్రి ఉషా ఠాకూర్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను బహిరంగంగా ఉరితీయాని.. అప్పుడే నేరాలు తగ్గుతాయని ఆమె అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను అభ్యర్థిస్తానని అన్నారు. రేపిస్టులను బహిరంగా ఉరితీసినప్పుడే.. మరొకరు ఈ నేరాలకు పాల్పడకుండా భయం పుడుతుందని అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా ఉన్నారు ఉషా ఠాకూర్.
Read Also: Tiger attacks: బాబోయ్ పులులు.. ఎడాపెడా దాడులు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తోందని.. కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేశంలో రేపిస్టులకు మరణశిక్ష విధించే నిబంధనలను రూపొందించిన మొదటిరాష్ట్రం మధ్యప్రదేశే ఉషా ఠాకూర్ వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 72 మంది నేరస్తులకు ఉరిశిక్ష విధించారని తెలిపారు. ఇలాంటి నేరాలు సమాజంలో మళ్లీ మళ్లీ చోటు చేసుకోవడం ఫోర్త్ ఎస్టేట్, మీడియా, మనందరికి ఆందోళన కలిగించే విషమని అన్నారు.
ఇలాంటి నేరాలు జరకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలని.. ఎవరైనా ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడితే అటువంటి నేరస్తులను బహిరంగ కూడళ్ల వద్ద శిక్ష విధించాలని ముఖ్యమంత్రిని కోరుతా అని అన్నారు. జైలులో ఇలాంటి శిక్షలు విధిస్తే..ఎవరికి తెలుస్తుందని ప్రశ్నించారు. ఇటీవల ఖాండ్వాలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి నిందితుడు చెరుకుతోటలో బాలికను వదిలివెళ్లారు. అపస్మారస్థితిలో ఉన్న చిన్నారికి ప్రస్తుతం ఇండోర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు వేరే జిల్లాలో అత్యాచారం కేసులో పట్టుబడ్డాడు. మంత్రి ఉషా ఠాకూర్ ఇద్దరి నిందితుల గురించి మాట్లాడుతూ.. బహిరంగ ఉరిని ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!