Ranya Rao Case: నన్ను ట్రాప్ చేశారు, విచారణలో విలపించిన రన్యా రావు..
- విచారణలో విలపించిన రన్యా రావు..
- తనను ట్రాప్ చేసినట్లు వెల్లడి..
- పరస్పర విరుద్ధ ప్రకటనలు..
- నిజంగా ఎవరైనా ట్రాప్ చేశారా..? అనే అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranya Rao Case: గోల్డ్ స్మగ్లింగ్లో కన్నడ నటి రన్యా రావు చిక్కడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 12 కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్ఐ అధికారులు రన్యా రావు నుంచి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక డీజీపీ రామచంద్రారావు సవతి కూతురు కూడా కావడంతో రన్యా రావు వ్యవహారం ఒక్కసారిగా వార్తాంశంగా నిలిచింది. దుబాయ్ నుంచి బెంగళూర్ వచ్చిన రన్యా రావు బంగారు కబడ్డీలను దాచిని బెల్ట్ని శరీరానికి కట్టుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు.
అయితే, విచారణ సంమయంలో రన్యా రావు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారుల ముందు తాను నిర్దోషి అని చెప్పడం కొనసాగించింది. విచారణ సమయంలో విలపించినట్లు తెలిసింది. నేరాన్ని అంగీకరించిన తర్వాత కూడా మరో కొత్త కోణాన్ని వెల్లడించింది. తన వద్ద నుంచి 17 బంగారు కబడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు అంగీకరించింది. ఆమె దుబాయ్ మాత్రమే కాకుండా యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ కూడా ప్రయాణించినట్లు చెప్పింది. పరస్పర విరుద్ధ వాదనలను విచారణలో వెల్లడించింది.
Also Read
అయితే, ఈ వాదనలతో నటి తనకు తెలియకుండానే స్మగ్లింగ్ రాకెట్లో చిక్కుకుందా..? ఆమె తెలిసే ఇదంతా చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రన్యా తాను ట్రాప్ చేయబడినట్లు అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. రన్యా నిజంగానే ఈ రాకెట్లో చిక్కుకున్నట్లయితే, దీని వెనక ఎవరున్నారనే దానిపై ఆమె వివరాలు వెల్లడించాలని, ఎలా చిక్కుకుందో చెప్పాలని అధికారులు చెబుతున్నారు.
Read Also: PNB SO Recruitment 2025: బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా?.. ఈ జాబ్స్ మీకోమే.. నెలకు రూ. లక్ష జీతం
గతేడాది చెన్నైలో జరిగిన స్మగ్లింగ్ సంఘటనతో ఈ కేసుకు కొన్ని పోలికలు ఉన్నాయి. కేరళకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య దుబాయ్ నుంచి 12 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడింది. గోల్డ్ స్మగ్లింగ్లో పాల్గొన్న ఆమె ఫ్రెండ్, ఆమెని బ్లాక్మెయిల్ చేశాడని దర్యాప్తులో తేలింది. అయితే, రన్యా సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, స్మగ్లింగ్లో పట్టుబడటం కూడా కొంత అనుమానాలకు కారణమవుతోంది. ఆమె భర్త జతిన్ హుక్కురి కూడా యూకేలోని ఐటీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నారు. చెన్నై కేసు మాదిరిగానే ఆమెని ట్రాప్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
దర్యాప్తులో ఆమెతో నిరంరతం సంప్రదింపులు జరిపిన వ్యక్తుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఆమె వద్ద నుంచి మొబైల్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం స్మగ్లింగ్ నెట్వర్క్ వెనక ఉన్న ప్రధాన సూత్రధారి కోసం అధికారులు అన్వేషణ ముమ్మరం చేశారు. రెండేళ్లుగా రన్యా రావు ఆర్థిక లావాదేవీలను, బ్యాంక్ రికార్డులను పరిశీలిస్తున్నారు. స్మగ్లింగ్ ద్వారా రన్యా రావు ఏవైనా ఆస్తుల్ని కూడబెట్టిందా..? అని పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!