Shraddha Walker Case: శ్రద్ధ ఆత్మగా తిరిగొచ్చి.. అఫ్తాబ్ని 70 ముక్కలు చేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Walker: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న శ్రద్ధా వాకర్ హత్య కేసుపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వింతగా స్పందించాడు. ఆ అమ్మాయి ఆత్మగా తిరిగొచ్చి, తనని కిరాతకంగా చంపిన అఫ్తాబ్ని 70 ముక్కలు చేయాలన్నాడు. ‘‘మరణించి విశ్రాంతి తీసుకోవడానికి బదులు.. శ్రద్ధ ఆత్మగా తిరిగొచ్చి, అతడ్ని 70 ముక్కలు చేయాలి. కేవలం చట్టం భయంతో ఇలాంటి హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరోధించలేం. మరణించిన వారు ఆత్మగా తిరిగొచ్చి, తమని హంతకుల్ని చంపినప్పుడే ఇలాంటి క్రైమ్స్ని ఆపగలం. దేవుడు దీనిని పరిగణనలోకి తీసుకొని, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా వర్మ ఆ భగవంతుడికి వింత అభ్యర్థన చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కాగా.. అఫ్తాబ్, శ్రద్ధా ఒక డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారడంతో, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ.. శ్రద్ధా తల్లిదండ్రులు అందుకు నిరాకరించడంతో, ఆ ప్రేమ జంట ఢిల్లీ వెళ్లింది. అప్పటినుంచి సహజవనం చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా ఒత్తిడి చేసింది. పెళ్లి విషయంపై వీరి మధ్య చాలాసార్లు గొడవ జరిగింది. మే 18వ తేదీ కూడా ఘర్షన జరగడంతో, అఫ్తాబ్ ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి, వాటిని ఫ్రిజ్లో పెట్టి, 18 రోజులపాటు వాటిని రాత్రివేళల్లో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి విసిరేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే.. శ్రద్ధా శరీర భాగాలు ఫ్రిజ్లో ఉండగానే, అఫ్తాబ్ మరో యువతికి గాలం వేసి, ఆమెను పలుమార్లు తన అపార్ట్మెంట్కు రప్పించుకున్నాడు.
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
శ్రద్ధా నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడం, సోషల్ మీడియాలోనూ స్పందన లేకపోవడంతో.. శ్రద్ధా సోదరుడు, స్నేహితులకు అనుమానం వచ్చింది. శ్రద్ధా తండ్రికి విషయం తెలియజేయగా, ఆయన ఢిల్లీలో వాళ్లు ఉండే ఫ్లాట్కు వెళ్లారు. అయితే, తాళం వేసి ఉండటంతో పోలీసుల్ని సంప్రదించారు. తొలుత పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఈ విస్తుగొలిపే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. శ్రద్ధా ముక్కల్ని ఫ్రిజ్లో ఉంచిన సమయంలో, అప్పుడప్పుడు ఆమె ముఖాన్ని బయటకు తీసి చూసేవాడని విచారణలో తేలింది.
Instead of resting in PEACE she should come back as a spirit and cut him into 70 PIECES
— Ram Gopal Varma (@RGVzoomin) November 16, 2022
Brutal murders can’t be prevented just by fear of law ..But they can be definitely stopped if the victims spirits come back from the dead and kill their killers ..I request God to consider this and do the needful 🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) November 16, 2022
తాజావార్తలు
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!