Shraddha Walker Case: శ్రద్ధ ఆత్మగా తిరిగొచ్చి.. అఫ్తాబ్ని 70 ముక్కలు చేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Walker: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న శ్రద్ధా వాకర్ హత్య కేసుపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వింతగా స్పందించాడు. ఆ అమ్మాయి ఆత్మగా తిరిగొచ్చి, తనని కిరాతకంగా చంపిన అఫ్తాబ్ని 70 ముక్కలు చేయాలన్నాడు. ‘‘మరణించి విశ్రాంతి తీసుకోవడానికి బదులు.. శ్రద్ధ ఆత్మగా తిరిగొచ్చి, అతడ్ని 70 ముక్కలు చేయాలి. కేవలం చట్టం భయంతో ఇలాంటి హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరోధించలేం. మరణించిన వారు ఆత్మగా తిరిగొచ్చి, తమని హంతకుల్ని చంపినప్పుడే ఇలాంటి క్రైమ్స్ని ఆపగలం. దేవుడు దీనిని పరిగణనలోకి తీసుకొని, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా వర్మ ఆ భగవంతుడికి వింత అభ్యర్థన చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కాగా.. అఫ్తాబ్, శ్రద్ధా ఒక డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారడంతో, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ.. శ్రద్ధా తల్లిదండ్రులు అందుకు నిరాకరించడంతో, ఆ ప్రేమ జంట ఢిల్లీ వెళ్లింది. అప్పటినుంచి సహజవనం చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా ఒత్తిడి చేసింది. పెళ్లి విషయంపై వీరి మధ్య చాలాసార్లు గొడవ జరిగింది. మే 18వ తేదీ కూడా ఘర్షన జరగడంతో, అఫ్తాబ్ ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి, వాటిని ఫ్రిజ్లో పెట్టి, 18 రోజులపాటు వాటిని రాత్రివేళల్లో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి విసిరేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే.. శ్రద్ధా శరీర భాగాలు ఫ్రిజ్లో ఉండగానే, అఫ్తాబ్ మరో యువతికి గాలం వేసి, ఆమెను పలుమార్లు తన అపార్ట్మెంట్కు రప్పించుకున్నాడు.
Also Read
- Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
శ్రద్ధా నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడం, సోషల్ మీడియాలోనూ స్పందన లేకపోవడంతో.. శ్రద్ధా సోదరుడు, స్నేహితులకు అనుమానం వచ్చింది. శ్రద్ధా తండ్రికి విషయం తెలియజేయగా, ఆయన ఢిల్లీలో వాళ్లు ఉండే ఫ్లాట్కు వెళ్లారు. అయితే, తాళం వేసి ఉండటంతో పోలీసుల్ని సంప్రదించారు. తొలుత పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఈ విస్తుగొలిపే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. శ్రద్ధా ముక్కల్ని ఫ్రిజ్లో ఉంచిన సమయంలో, అప్పుడప్పుడు ఆమె ముఖాన్ని బయటకు తీసి చూసేవాడని విచారణలో తేలింది.
Instead of resting in PEACE she should come back as a spirit and cut him into 70 PIECES
— Ram Gopal Varma (@RGVzoomin) November 16, 2022
Brutal murders can’t be prevented just by fear of law ..But they can be definitely stopped if the victims spirits come back from the dead and kill their killers ..I request God to consider this and do the needful 🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) November 16, 2022
తాజావార్తలు
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!