Amit Shah: చైనాపై నెహ్రూకు ప్రేమ.. అందుకే భారత్కు శాశ్వత సభ్యత్వం దక్కలేదు.
Rajiv Gandhi Foundation took grants from China, Zakir Nair says amit shah:రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జిఎఫ్)కు చైనా రాయబార కార్యాలయం, ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ నుంచి నిధులు పొందిందని.. అందుకే దాని రిజిస్ట్రేషన్ రద్దు చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం అన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎఫ్సీఆర్ఏ (విదేశీ కంట్రిబ్యూషన్ (నియంత్రణ) చట్టం) ఉల్లంఘించిందుకే ఈ చర్యను తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై ప్రశ్నలను నిలువరించేందుకే కాంగ్రెస్ పార్లమెంట్ లో సరిహద్దు సమస్యలను లేవనెత్తిందని అన్నారు.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్, చైనా రాయబార కార్యాలయం నుంచి రూ. 1.35 కోట్ల నిధులను అందుకుందని అమిత్ షా ఆరోపించారు. 2005-07లో చైనీస్ ఎంబీసీ నుంచి రూ. 1.35 కోట్లను పొందిన రాజీవ్ ఫౌండేషన్ వాటిని ఏం చేసిందో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే విధంగా 2011 జూలైలో అనుమతి లేకుండా రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఎఫ్సీఆర్ఏ ఖాతాలో జకీర్ నాయక్ సంస్థ నుంచి రూ.50 లక్షలు ఎందుకు తీసుకుందో దేశానికి చెప్పాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేశారు.
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
Read Also: Asaduddin Owaisi: చైనా పేరు చెబితేనే ప్రధాని మోదీ భయపడుతున్నారు..
నెహ్రుకు చైనాపై ఉన్న ప్రేమ కారణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వాన్ని కోల్పోయిందని అన్నారు. ఎంబసీల నుంచి వచ్చిన నిధులను భారత్-చైనా సంబంధాలపై పరిశోధనలు చేయడానికి ఉద్దేశించినట్లుగా కాంగ్రెస్ చెబుతుందని.. 1962లో జరిగిన యుద్ధంలో భారత్ కోల్పోయిన భూమికి సంబంధించిన అంశాన్ని ఈ పరిశోధనలో పొందుపరిచారా..? అని, 2009 అక్టోబర్ 13న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా ప్రశ్నలు లేవనెత్తిందని గుర్తుచేస్తూ, ఈ అంశంపై పార్టీ పరిశోధన చేసిందా అని అమిత్ షా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.
గాల్వాన్ లో భారత సైనికులు చైనా సైన్యంతో పోరాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరు చైనా రాయబార కార్యాలయ అధికారికి విందు ఇస్తున్నారని.. చైనా నుంచి ఎదురైన బెదిరింపులతో 2012లో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని అమిత్ షా ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!