Amit Shah: చైనాపై నెహ్రూకు ప్రేమ.. అందుకే భారత్కు శాశ్వత సభ్యత్వం దక్కలేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajiv Gandhi Foundation took grants from China, Zakir Nair says amit shah:రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జిఎఫ్)కు చైనా రాయబార కార్యాలయం, ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ నుంచి నిధులు పొందిందని.. అందుకే దాని రిజిస్ట్రేషన్ రద్దు చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం అన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎఫ్సీఆర్ఏ (విదేశీ కంట్రిబ్యూషన్ (నియంత్రణ) చట్టం) ఉల్లంఘించిందుకే ఈ చర్యను తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై ప్రశ్నలను నిలువరించేందుకే కాంగ్రెస్ పార్లమెంట్ లో సరిహద్దు సమస్యలను లేవనెత్తిందని అన్నారు.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్, చైనా రాయబార కార్యాలయం నుంచి రూ. 1.35 కోట్ల నిధులను అందుకుందని అమిత్ షా ఆరోపించారు. 2005-07లో చైనీస్ ఎంబీసీ నుంచి రూ. 1.35 కోట్లను పొందిన రాజీవ్ ఫౌండేషన్ వాటిని ఏం చేసిందో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే విధంగా 2011 జూలైలో అనుమతి లేకుండా రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఎఫ్సీఆర్ఏ ఖాతాలో జకీర్ నాయక్ సంస్థ నుంచి రూ.50 లక్షలు ఎందుకు తీసుకుందో దేశానికి చెప్పాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేశారు.
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
Read Also: Asaduddin Owaisi: చైనా పేరు చెబితేనే ప్రధాని మోదీ భయపడుతున్నారు..
నెహ్రుకు చైనాపై ఉన్న ప్రేమ కారణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వాన్ని కోల్పోయిందని అన్నారు. ఎంబసీల నుంచి వచ్చిన నిధులను భారత్-చైనా సంబంధాలపై పరిశోధనలు చేయడానికి ఉద్దేశించినట్లుగా కాంగ్రెస్ చెబుతుందని.. 1962లో జరిగిన యుద్ధంలో భారత్ కోల్పోయిన భూమికి సంబంధించిన అంశాన్ని ఈ పరిశోధనలో పొందుపరిచారా..? అని, 2009 అక్టోబర్ 13న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా ప్రశ్నలు లేవనెత్తిందని గుర్తుచేస్తూ, ఈ అంశంపై పార్టీ పరిశోధన చేసిందా అని అమిత్ షా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.
గాల్వాన్ లో భారత సైనికులు చైనా సైన్యంతో పోరాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరు చైనా రాయబార కార్యాలయ అధికారికి విందు ఇస్తున్నారని.. చైనా నుంచి ఎదురైన బెదిరింపులతో 2012లో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని అమిత్ షా ప్రశ్నించారు.
తాజావార్తలు
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!