Rajasthan: వరకట్న పిశాచికి మరొకరు బలి.. కుమార్తెతో సహా లెక్చరర్ సజీవదహనం
- రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో దారుణం
- వరకట్న పిశాచికి మరొకరు బలి
- కుమార్తెతో సహా లెక్చరర్ సజీవదహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరకట్న పిశాచికి మరొకరు బలి అయ్యారు. ఒక లెక్చరర్.. కుమార్తెతో సహా సజీవదహనం అయింది. ఈ ఘోర విషాద ఘటన రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
సంజు బిష్ణోయ్… జోధ్పూర్ జిల్లాలో లెక్చరర్గా పని చేస్తోంది. అయితే ఇంట్లో నిత్యం భర్త, అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారు. ఈ వేధింపులు రోజురోజుకు మరింత తీవ్రం కావడంతో విసుగెత్తిపోయింది. దీంతో మూడేళ్ల కుమార్తె యశస్వితో కలిసి పెట్రోల్ పోసుకుని సజీవదహనం అయ్యారరు. ఘటనాస్థలిలోనే కుమార్తె ప్రాణాలు వదలగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంజు శనివారం మృతిచెందింది.
Also Read
- India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
ఇది కూడా చదవండి: Upasana : హోదా కాదు, కీర్తి కాదు.. నన్ను నేను నిలబెట్టిన శక్తి ఇదే
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది.
శుక్రవారం మధ్యాహ్నం సంజు పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. డాంగియావాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్నాడ గ్రామంలో ఇంట్లో కుమార్తెతో కుర్చీపై కూర్చుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇంట్లో భర్త, అత్తమామలు లేరని చెప్పారు. ఇంట్లో నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. సంఘటనాస్థలికి చేరుకునే సమయానికి రక్షించేందుకు అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. ఇక పోస్టుమార్టం తర్వాత మృతదేహాలపై బాధితురాలి తల్లిదండ్రులు-అత్తమామల మధ్య ఘర్షణ తలెత్తింది. చివరికి బాధితురాలి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో దహన సంస్కరాలు ముగించారు.
ఇది కూడా చదవండి: Mirabai Chanu: గోల్డ్ మెడల్ కొట్టిన మీరాబాయి చాను!
జోధ్పూర్ జిల్లాలోని ఫిట్కాస్ని గ్రామానికి చెందిన బాధిత మహిళా తల్లిదండ్రులు.. అల్లుడు దిలీప్ బిష్ణోయ్, అతని తల్లి, తండ్రిపై ఫిర్యాదు చేశారు. వారి వేధింపులు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దీంతో భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) బృందం సహాయంతో పోలీసులు సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో భర్త, అత్తగారు, మామగారు, వదిన వేధించారని ఆరోపించింది. గణపత్ సింగ్ అనే వ్యక్తిపై కూడా వేధింపుల ఆరోపణలు చేసింది. గణపత్ సింగ్తో కలిసి మహిళను భర్త శారీరకంగా వేధించినట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..