Coimbatore Car Blast: కోయంబత్తూర్ పేలుడు కేసు.. 21 చోట్ల ఎన్ఐఏ దాడులు, నలుగురి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coimbatore Car Blast: 2022లో ఐఎస్ఐఎస్ ప్రేరేపిత కోయంబత్తూర్లో కారు బాంబు పేలుడు, ఐసిస్ రాడికలైజేషన్, రిక్రూట్మెంట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వేగం పెంచింది. తమిళనాడులోని 21 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసింది. శనివారం నిర్వహించిన యాంటీ టెర్రర్ ఏజెన్సీ సెర్చ్ ఆపరేషన్లో భారీ సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆరు ల్యాప్టాపులు, 25 మొబైల్ ఫోన్లు, 34 సిమ్ కార్డులు, ఆరు ఎస్డీ కార్డులను, మూడు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Sundeep Kishan: ముగ్గురు హీరోయిన్స్ తో బ్రేకప్ గ్రేట్ కాదు.. సీక్రెట్ గా మెయింటైన్ చేశావ్ చూడు
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
మద్రాస్ అరబిక్ కాలేజ్, కోవై అరబిక్ కాలేజీకి సంబంధించిన 11 ప్రదేశాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అరబిక్ తరగతుల వేషంలో హింసాత్మక ప్రచారం, యువతను రాడికలైజేషన్, జిహాద్ని ప్రోత్సహిస్తున్నట్లు తేలింది. ఖిలాఫత్, ఐసిస్ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ఐసిస్ కార్యకర్తలు తరగతులను నిర్వహించడంతో పాటు సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదానికి పాల్పడున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. పేలుడు కేసులో అరెస్టయిన 10 మంది నిందితులకు కోయంబత్తూరులోని కోవై అరబిక్ కాలేజీతో సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
కారుబాంబు కేసుతో సంబంధం ఉన్న మరో 10 చోట్ల ఎన్ఐఏ శనివారం ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. 2019లో శ్రీలంక కొలంబో దాడుల్లో 250 మంది మరణానికి కారణమైన శ్రీలంక ఉగ్రవాది జహ్రాన్ హషీమ్ని నిందితులు ప్రశంసించినట్లు దర్యాప్తులో తేలినట్లు ఎన్ఐఏ తెలిపింది. పట్టుబడిన ఉగ్రవాదులను జమీల్ బాషా ఉమరి, మౌల్వీ హుస్సేన్ ఫైజీ అలియాస్ మహ్మద్ హస్సేన్ ఫైజీ, ఇర్షాత్, ఇర్షాత్లు ఇద్దరు అరబిక్ కాలేజ్ పూర్వ విద్యార్థులుగా తేలింది. నాలుగో వ్యక్తిని సయ్యద్ అబ్దుల్ రెహ్మా్న్ ఉమారీగా గుర్తించారు.
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!