తమిళనాడు కూనురు దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కూలిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు వున్నారు. ప్రమాదంలో 11 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య ఆచూకీ కూడా తెలియడం లేదని సమాచారం. బిపిన్ రావత్, ఆయన భార్య క్షేమంగా వుండాలని, వీరు త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Hoping for the safety of CDS General Bipin Rawat, his wife and others onboard the chopper.
— Rahul Gandhi (@RahulGandhi) December 8, 2021
Prayers for speedy recovery.