Congress: గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీల వర్షం.. రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఇంకెన్నో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీతో అమీతుమీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే ఆప్ నుంచి ఎదురవుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని గుజరాత్లో హామీల వర్షం గుప్పించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో గుజరాత్ పలు హామీలను గుప్పించారు. అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ వద్ద ‘పరివర్తన్ సంకల్ప్ ర్యాలీ’లో కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ ప్రజలకు గాంధీ అనేక వాగ్దానాలు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ హామీలను అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో వెల్లడించారు. పరివర్తన్ సంకల్ప్ సమ్మేళన్ పేరిట కీలక హామలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల హామీలివే..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
1. రూ.500కే గ్యాస్ సిలిండర్
2. 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం
3. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం
4. రూ.3 లక్షల వరకు రైతు రుణమాఫీ
5. 3000 ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల ఏర్పాటు
6. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం
7. పాల ఉత్పత్తిదారులకు లీటరుపై రూ.5 సబ్సిడీ
8. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు విధానానికి స్వస్తి. నిరుద్యోగులకు రూ.3,000 నిరుద్యోగ భృతి.
తాము గుజరాత్ ప్రజల కోసం పని చేస్తామని.. బీజేపీలాగా ఇద్దరు ముగ్గురు స్నేహితుల కోసం కాదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇదే కాంగ్రెస్ సంకల్పమని.. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ.. “ఇక్కడి బీజేపీ ప్రభుత్వం అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తుంది, అయితే వారు రైతుల రుణాలను మాఫీ చేసినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రతి రైతుకు రూ.3 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. గుజరాత్లో మేం అధికారంలోకి వస్తాం. ” అని రాహుల్ అన్నారు. గుజరాత్ డ్రగ్స్కు కేంద్రంగా మారిందని.. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ సోమవారం మండిపడ్డారు. ‘గుజరాత్ డ్రగ్స్కు కేంద్రంగా మారింది. ముంద్రా పోర్టు నుంచి డ్రగ్స్ను తరలిస్తారు కానీ మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. ఇది గుజరాత్ మోడల్.’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
7. दुग्ध उत्पादकों को 1 लीटर पर ₹5 की सब्सिडी
8. सरकारी नौकरियों में कांट्रैक्ट सिस्टम बंद और युवाओं के लिए ₹3000 का बेरोज़गारी भत्ताहम गुजरात की जनता के लिए काम करेंगे, भाजपा की तरह 2-3 'मित्रों' के लिए नहीं।
ये हमारा संकल्प है और गुजरात की जनता कांग्रेस को जिताएगी।
— Rahul Gandhi (@RahulGandhi) September 5, 2022
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!