Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల విదేశీ పర్యటనకు సంబంధించి ఒక ఫోటో వైరల్ అయింది. ఆయన పక్కనే ఒక బాబు, మహిళ కూర్చున్న ఫోటోలు, వీరంతా ఒక పడవలో ప్రయాణిస్తు్న్న ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. అయితే, ఈ ఫోటోను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎక్స్లో షేర్ చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. ‘‘ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు..? మీతో ఉన్న వ్యక్తులు ఎవరు..? ’’ అని ప్రశ్నించారు.
“రాహుల్ జీ, ఈ ఫొటో ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు? ఈ ఫొటోలో మీతో ఉన్న వ్యక్తులు ఎవరు? తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది” అంటూ గిరిరాజ్ సింగ్ ఎక్స్లో పోస్టు చేశారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన గురించి బీజేపీ గత కొంత కాలంగా ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ప్రతిపక్ష నేత ఆచూకీ లేకుండా కొన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్తుండటాన్ని ప్రశ్నిస్తోంది.
ఈ ఫోటోపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. రాహుల్ గాంధీతో ఫొటోలో ఉన్న మహిళ, చిన్నారి ఆయన స్నేహితుడి భార్య, కుమారుడని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కుటుంబంతో కలిసి వెకేషన్కు వెళ్లిన సమయంలో ఈ ఫొటో తీసినట్లు తెలిపింది. అయితే రాహుల్ స్నేహితుడు ఫొటోలో లేరని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సప్రియా శ్రీనేత్ గిరిరాజ్ సింగ్పై తీవ్రంగా స్పందించింది. మహిళ, పరుషుడుతో కలిసి ఉన్న ఫోటోను చూసి అసభ్య ఆలోచనలు చేయడం సరికాదని విమర్శించారు. ఈ ఫోటో టెక్సాస్లోని లేక్ రే రాబర్ట్స్లో తీసిందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ అవి దండియా వెల్లడించారు.
గత కొంత కాలంగా రాహుల్ విదేశీ పర్యటనలు వివాదాస్పదమవుతున్నాయి. జూన్ 22 నుంచి జూలై 13 వరకు రాహుల్ గాంధీ విదేవీ పర్యటనపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన ఎక్కడికి వెళ్లారు.? ఎవరిని కలిశారు? ఆ ప్రమాణ ఖర్చులు, వసతి ఎవరు భరించారు? అని ప్రశ్నించారు. బీజేపీ ముంబై అధ్యక్షుడు అమీత్ సతామ్, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో భారత్కు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని కలిశారని ఆరోపించారు.

