Rahul Gandhi: బిల్కిస్ బానో కేసుతో మహిళలకు ఏం సందేశం ఇస్తున్నారు…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi targets PM over release of Bilkis Bano case convicts: బిల్కిస్ బానో అత్యాచార ఘటనలో నిందితులుగా ఉన్న 11 మందిని విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఫైర్ అవుతోంది. గ్యాంగ్ రేప్, హత్యలు చేసిన నిందితులను సత్ప్రవర్తన ద్వారా విడుదల చేయడంపై బీజేపీ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. నారీ శక్తి అని స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రసంగించిన ప్రధాని మోదీ కొన్ని గంటల్లోనే మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను విడుదల చేశారని.. మోదీ మాటలకు, చేతలకు సంబంధం లేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
Read Also: Ab Raju: చిత్ర పరిశ్రమలో దారుణం.. ఆరేళ్ళ చిన్నారిపై కమెడియన్ రాజు అత్యాచారం
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
నారీశక్తి గురించి మట్లాడే వారు ఈ దేశంలోని మహిళలకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఐదు నెలల గర్భిణిపై అత్యాచారం చేసి, మూడేళ్ల కుమార్తె హత్య చేసిన వారిని ‘ ఆజాదీ కా అమృత్ దినోత్సవ్’ సందర్భంగా విడుదల చేశారని.. నారీ శక్తి గురించ అబద్ధాలు చెప్పే వారు దేశంలోని మహిళకలు ఏం సందేశం ఇస్తున్నారు? అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అంతకుముందు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పపట్టారు. వచ్చే ఎన్నికల కోసమే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అనుమతి లేకుండా.. గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసిందని అనుకుంటున్నారా..? అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
2002 గోద్రా అల్లర్ల సమయంలో చెలరేగిన మతఘర్షణల్లో బిల్కిస్ బానో అత్యాచార ఉదంతం దేశాన్ని కుదిపేసింది. అల్లర్ల సమయంలో ఐదునెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె మూడేళ్లు కూతురుతో సహా ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసును ముంబై ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. 11 మందిని దోషులుగా తేలుస్తూ తీర్పు చెప్పింది. ఆ తరువాత బాంబే హైకోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది.
తాజావార్తలు
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
-
UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
-
Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
ట్రెండింగ్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!