Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
- మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
- 12 ఏళ్ల పాలనతో ప్రజలకు ఇక్కట్లు
- ముఖేష్, అదానీ బాగుపడ్డారని విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. గత 12 ఏళ్లుగా మోడీ తీసుకున్న నిర్ణయాల ప్రభావం అంబానీ, అదానీ కాకుండా రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, యువత ఎదుర్కోవాల్సి వస్తోందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ప్రజల సమస్యలను ప్రధాని పట్టించుకోకపోతే దేశం పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ముఖేష్ అంబానీపై కూడా విమర్శల దాడి చేశారు. ‘‘అంబానీ వేల కోట్ల రూపాయల విలువైన చమురును ఇతర దేశాలకు విక్రయిస్తున్నారు. కానీ మోడీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.’’అని విమర్శించారు. ఇక అదానీపై అమెరికాలో ఉన్న కేసులన్నీ ఎత్తివేస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు.
Also Read
సాధారణ ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. కానీ ప్రజలు తినడానికే డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటప్పుడు ఎలా కొంటారని ధ్వజమెత్తారు. దేశంలో గ్యాస్ కొరత కూడా నెలకొందని ఆరోపించారు. ఇక ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ‘‘మోడీ రిమోట్ కంట్రోల్ అమెరికాలో ఉంది. ఆయన ఎప్పుడూ ఇతర దేశాలకు వెళ్లినా క్షమాపణలు కోరుతూనే ఉంటారు.’’ అంటూ వ్యాఖ్యానించారు.
#WATCH | Raebareli, Uttar Pradesh: In a public meeting, LoP & Congress leader Rahul Gandhi says, “The consequence of what Modi has done for the last 12 years will not have to be faced by Ambani and Adani but farmers, labourers, small business owners and youth…if the PM does not… pic.twitter.com/SnDqa3hTsX
— ANI (@ANI) May 19, 2026
తాజావార్తలు
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!