Delhi: 35 నిమిషాలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు.. ఈసారి కర్ణాటక పంచాయితీ తెగేనా?
- హస్తినకు చేరిన కర్ణాటక పంచాయితీ
- సిద్ధరామయ్య-డీకే.శివకుమార్తో వరుస చర్చలు
- 35 నిమిషాలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక పంచాయితీ మరోసారి హస్తినకు చేరింది. గత కొంత కాలంగా స్తబ్దతగా ఉన్న కుర్చీ పంచాయితీ.. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తట్టిలేపినట్లైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రిని ఎంపిక చేశారు. ఎలాంటి రచ్చ లేకుండా సానుకూలంగా హైకమాండ్ చక్కబరించింది. ఇప్పుడు కర్ణాటక వంతు వచ్చింది. ఈసారి డీకే.శివకుమార్ తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.

Also Read
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
- E20 protest: E20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..
- Ayodhya Ram mandir: అయోధ్య రామాలయంలో "బంగారు రామచరితమానస్" మాయం.?
ప్రస్తుతం సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ ఢిల్లీలో మకాం వేశారు. ఇక మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్తో కేసీ వేణుగోపాల్ వరుస సమావేశాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ మొదలుకొని కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా వరకు అందరూ నిరంతరం రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ 35 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరిపారు. డీకే.శివకుమార్ మరొక గదిలో నిరీక్షిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. అంతకముందు మల్లిఖార్జున ఖర్గే, కేసీ.వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలాతో దాదాపు 2 గంటల పాటు రాహుల్ గాంధీ మేథోమధనం చేసినట్లుగా సమాచారం. ఈ సమయంలో రణదీప్ సుర్జేవాలా ప్రభుత్వ పనితీరుపై ఒక నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. అనంతరం సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్యంగా సమావేశమై 35 నిమిషాలు చర్చించారు. అయితే ఏం చర్చించారన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!